India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.

ఏపీలోని ప్రకాశం జిల్లాలో శిశుగృహ, బాల సదనంలో 16 ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB,పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ, బీఈడీ, బీఏ బీఈడీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

TG: రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ ద్వారా డిసెంబర్ 19-21 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఈవెంట్కు సంబంధించిన లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ ఇటీవల ఆవిష్కరించారు.

TG: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. దీనికి మద్దతివ్వాలా? లేదా అనే దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. BILLలోని డిస్కామ్ల ప్రైవేటీకరణ, అగ్రి ఇతర రంగాలకు సబ్సిడీల తగ్గింపు తదితరాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే నిధుల కేటాయింపు వంటి అంశాలూ ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. NOV 8లోగా అభిప్రాయాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని రామ్లాల్ వృద్ధాశ్రమం అద్దెకు తాతయ్య, బామ్మ అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతినిస్తుంది. జపాన్లోని సిస్టం స్ఫూర్తితో ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

అణ్వాయుధ పరీక్షలు చేస్తామన్న ట్రంప్ <<18207970>>ప్రకటన<<>> అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా, రష్యా, నార్త్ కొరియాలు మరోసారి న్యూక్లియర్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. ఇది క్రమంగా న్యూక్లియర్ వెపన్స్ రేసుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా అణ్వాయుధ దేశాలైన UK, ఫ్రాన్స్, ఇండియా, పాక్ కూడా ఆ బాట పట్టొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 12K న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>
Sorry, no posts matched your criteria.