India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి వచ్చి వెళ్లే 90 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 11 ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా ఉన్నాయి. కేంద్రం ఆదేశాలతో త్వరలోనే విమానాలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కాగా PAKలోని ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని కేంద్రం ప్రకటించింది.
అమ్మానాన్న విడిపోవడం లేదా ఇద్దరిలో ఒకరు చనిపోయినప్పుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నిలబడాలి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం పెట్టాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ, జీవితాన్ని సమన్వయం చేసుకోవడంపై సాధన చేయాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ముందడుగు వేస్తారు.
TG: హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులను రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయకుండా ప్రజలకు మేలు జరగకుండా కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. పెట్టుబడులు రావడం ద్వారానే అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభిస్తుందన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు HCUకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇవాళ మూడు కొత్త చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి జంటగా నటించిన ‘జాక్’, అజిత్-త్రిష కీలక పాత్రలు పోషించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రాలన్నీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
పాక్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా రూపొందిన ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్లు, ఇతర మీడియా కంటెంట్ను మన దేశంలో బ్యాన్ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.
సరిహద్దుల్లో సైనికులు రేయింబవళ్లు గస్తీ కాస్తుండటం వల్లే మనం క్షేమంగా ఉంటున్నాం. ప్రత్యర్థులు తూటాలు సంధిస్తున్నా మన జవాన్లు ముందుండి ధైర్యంగా పోరాడుతున్నారు. ఆ సమయంలో కొందరు సైనికులు చనిపోయి కుటుంబానికి శోకాన్ని మిగుల్చుతుంటారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో మన సైనికులకు ఎలాంటి హానీ జరగొద్దని, వారు క్షేమంగా ఉండాలని మనమంతా ప్రార్థిద్దాం. వారంతా మన ఫ్యామిలీనే అని గుర్తిద్దాం. ‘జైహింద్’ COMMENT
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లు ఇష్టపడనివారుండరు. అయితే, మార్కెట్లో దాదాపు 37 రకాల మామిడి పండ్లున్నాయనే విషయం చాలామందికి తెలియదు. అందులో కొన్ని.. బంగినపల్లి, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, అంటు మామిడి, బెంగుళూరు మామిడి, రసాలు, చెరకు రసాలు, షోలాపూరి, అల్ఫాన్సా, నూజివీడు రసం, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణరేఖ, పండూరివారి మామిడి, కొండమామిడి.
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఫోకస్ చేసింది. ఈ కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన FIR వివరాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉందని అధికారులు గుర్తించిన వారి బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను అందజేయాలని లేఖ రాసింది. అరెస్టయిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, వారిపై ఛార్జ్షీట్ నమోదు చేసి ఉంటే ఆ కాపీలనూ అందజేయాలంది.
లాహోర్, రావల్పిండి నగరాల్లో భారత దాడుల తీవ్రత ఊహాతీతం. ఆర్థిక నష్టాన్ని పక్కన పెడితే మన సైన్యం శత్రుదేశం నాభికి గురిపెట్టి నాశనం చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ బ్యాటరీలను బూడిద చేయడం తెలిసిందే. అంటే మన క్షిపణులు దాడిచేస్తే ఆపలేరు. వాళ్లు ప్రయోగించాలంటే బ్యాటరీలు ఉండవు. రెంటికీ చెడ్డ రేవడిగా మారిన పాక్ దీన్నుంచి కోలుకోవడం సులువేం కాదని నిపుణుల అంచనా. మీరేమంటారు?
Sorry, no posts matched your criteria.