India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
AP: అనంతపురం పట్టణంలో రేపు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రేపు హాలిడే ఇస్తున్న కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.
1.హిమాలయ దేశం నేపాల్లో నెలకొన్న అవినీతి, దానికి పరిష్కారం లేకపోవడంపై ఆ దేశ Zen Z(యువత) ‘అసహనం’తో ఉంది. 2.కొందరు నేతలు కుటుంబాలతో విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడిపే వీడియోలు ఇటీవల వైరలవగా ప్రజా ధనంతో పాలకుల జల్సాలా? అనే ‘ఆవేదన’ వ్యక్తమైంది. 3.దేశంలో రిజిస్టర్ కాలేదని SM సైట్లను ప్రభుత్వం నిషేధించింది. దీంతో తమ గొంతును పాలకులు అణిచివేశారనే ‘ఆగ్రహం’తో నిరసన జ్వాల నియంత్రణ తప్పి కార్చిచ్చులా దహిస్తోంది.
AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకి మీడియాతో సమావేశం అవుతారని YCP ప్రకటనలో తెలిపింది. ఇవాళ యూరియా కొరతపై వైసీపీ నేతలు ‘అన్నదాత పోరు’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది.
TG: ఫార్ములా ఈ-రేస్ <<16712706>>కేసులో<<>> కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సహా మరో నలుగురిపై న్యాయ విచారణకు ACB సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్కుమార్, BLN రెడ్డి, కిరణ్, FEO సీఈవోపై ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని సమాచారం.
APలో స్థానిక సంస్థలకు 4 దశల్లో <<17606799>>ఎన్నికలు<<>> జరుపుతామని SEC నీలం సాహ్ని చెప్పారు. మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. EVMలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్లో EVMలు వాడారని గుర్తు చేశారు. EVMల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈ ఉదయం 10 గం. నుంచి సా.5 గంటల వరకు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 768 ఓట్లు పోల్ అయ్యాయి. సా.6 గం. నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ అధికారులు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాను ఇచ్చింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని CM కోరారు.
భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ప్రదేశ్కు ప్రధాని మోదీ రూ.1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నష్ట తీవ్రతపై అధికారులతో సమీక్షించారు. వరదలు, ప్రకృతి విపత్తులో చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాసేపట్లో ప్రధాని పంజాబ్కు చేరుకోనున్నారు.
AP: విజయవాడ CK కన్వెన్షన్లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్క్లేవ్ ఇదే.
Sorry, no posts matched your criteria.