India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ముస్లిం సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కృష్ణ జన్మభూమిపై హిందూ సంఘాలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.
TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ Way2Newsకు తెలిపారు. KCRకు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సాధారణ నీరసానికే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధమవుతున్నారని దాసోజు పేర్కొన్నారు. కాగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు.
తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.
TG: మల్లిఖార్జున ఖర్గే పర్యటనపై మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలతో ఆ పార్టీలో కొత్త కలకలం రేగింది. పలు పేపర్లకు రెవెన్యూ మంత్రి ఇచ్చిన యాడ్లలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫొటో లేదు. ఇటీవల ఆయనను మీనాక్షి మందలించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఫొటో లేకపోవడానికి కారణమదే అయ్యుండొచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ యాడ్లలో పార్టీ ఇన్ఛార్జ్ ఫొటో ఉంది(Slide:2).
ఇంగ్లండ్పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేషన్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించింది.
Sorry, no posts matched your criteria.