India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మల్లిఖార్జున ఖర్గే పర్యటనపై మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలతో ఆ పార్టీలో కొత్త కలకలం రేగింది. పలు పేపర్లకు రెవెన్యూ మంత్రి ఇచ్చిన యాడ్లలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫొటో లేదు. ఇటీవల ఆయనను మీనాక్షి మందలించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఫొటో లేకపోవడానికి కారణమదే అయ్యుండొచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ యాడ్లలో పార్టీ ఇన్ఛార్జ్ ఫొటో ఉంది(Slide:2).
ఇంగ్లండ్పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేషన్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించింది.
TG: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన భయానకమని మాజీ మంత్రి KTR అన్నారు. ఈ ఘటనలో మృతుల శరీర అవశేషాలను కార్డ్బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని విమర్శించారు. SLBC ఘటనలో పరిహారం కోసం 8 కుటుంబాలు వేచి చూస్తున్నాయని, వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు.
AP: మొహర్రం సందర్భంగా రేపటి ఆప్షనల్ హాలిడేపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ ఆప్షనల్ సెలవును స్కూళ్లు వాడుకోవచ్చా? లేదా? అనే సందిగ్ధత నెలకొందని, విద్యాశాఖ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత వారంలో రథయాత్రకు సెలవు ప్రకటించి, చివరి నిమిషంలో రద్దు చేశారని పేర్కొంటున్నాయి. రేపటి ఆప్షనల్ సెలవుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా సిద్ధమైంది. 1776లో ఇదే రోజున బ్రిటిష్ పాలకుల నుంచి ఆ దేశం విముక్తి పొందింది. 249వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అమెరికన్లు సంబరాలు చేసుకోనున్నారు. జాతీయ జెండాలతో అలంకరణలు, పరేడ్లు నిర్వహిస్తారు. హాలిడే కావడంతో కుటుంబ సభ్యులంతా ఓ చోటకు చేరుకోనున్నారు. అయితే సెలబ్రేషన్స్ కోసం అమెరికన్లు ఒక్కరోజే $2.8 బిలియన్లు ఖర్చు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.
ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.
‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపరుచుకోనుంది.
DC: డుప్లెసిస్, పోరెల్, KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, మాధవ్ తివారీ, స్టార్క్, చమీరా, కుల్దీప్, నటరాజన్
PBKS: ప్రభ్సిమ్రాన్, ప్రియాంశ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, అజ్మతుల్లా, చాహల్
Sorry, no posts matched your criteria.