India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వీధికుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ‘స్కూల్స్, రైల్వే స్టేషన్స్, ఆస్పత్రుల్లోకి వీధికుక్కలు రాకుండా 8 వారాల్లో ఫెన్సింగ్ వేయాలి. NH, ఎక్స్ప్రెస్ హైవేలపైకి మూగజీవాలు రాకుండా చూడాలి. పబ్లిక్ ఏరియాల్లో స్ట్రే డాగ్స్ తిరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించింది. అమికస్ క్యూరీ దీనిపై నివేదిక అందించాలంది. అమలుపై అఫిడవిట్లు వేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

నువ్వుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. హైబీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచడంలోనూ నువ్వులు సహాయం చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజాబిలిటీస్ (NIEPMD)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, మహిళలు, PWBDకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. BOT, PG డిప్లొమా, BPT, Bsc నర్సింగ్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://<

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.

<

వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 150వ స్మారకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం’ అని పేర్కొన్నారు.

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్లో లెస్బియన్ చాటింగ్ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.