News March 22, 2024

ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు?

image

మద్యం పాలసీ కేసులో అరెస్టయినప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ CMగా కొనసాగుతారని AAP స్పష్టం చేసింది. అయితే ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే లేదా ఆయనకు శిక్ష పడితే నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. రిటైర్డ్ IRS అధికారిణి అయిన ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ CM భగవంత్ మాన్‌కు అప్పగించే అవకాశముందని చెబుతున్నారు.

News March 22, 2024

మోదీ, కేసీఆర్‌కు తేడా లేదు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News March 22, 2024

భువనేశ్వరి చెక్కుల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు

image

AP: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేయడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. చెక్కుల పంపిణీపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.

News March 22, 2024

25న భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

image

TG: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం పనులకు మార్చి 25న శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములు దంచుతారు. అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా.. నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

News March 22, 2024

నేను పార్టీ మారట్లేదు: వైసీపీ ఎంపీ చింతా అనురాధ

image

AP: తాను బీజేపీలోకి <<12896599>>వెళ్తున్నట్లు<<>> వచ్చిన వార్తలను అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ ఖండించారు. ‘నేను పార్టీ మారట్లేదు. గత ఎన్నికల్లో నన్ను గెలిపించేంత వరకు సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిది. ఈ ఐదేళ్లు ఎంతో అండగా నిలిచారు. ఆయనను నమ్ముకున్న వారికి భరోసాగా ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా రేసులో ఉన్న వ్యక్తికి, మా కుటుంబానికి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు.

News March 22, 2024

BJPతో టచ్‌లో లేను: మంత్రి పొంగులేటి

image

TG: తాను బీజేపీ కానీ, మరే ఇతర పార్టీలతో కానీ టచ్‌లో లేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘రోజూ సీఎం రేవంత్ వెంట ఉంటే నంబర్ 2 అవుతానా? నేను సీఎం కావాలంటే మా అధిష్ఠానం కొన్ని సమీకరణాలు చూస్తుంది. నాకు సీఎం కావాలని లేదు. నాపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారు. నేను ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నానని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

News March 22, 2024

జీతాలు పెంచేందుకు అనుమతి

image

దేశ వ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలను కేంద్రం పెంచనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో జీతాలు పెంచేందుకు ఈసీ అనుమతించింది. జీతాల పెంపు ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్త నిర్ణయం కాదన్న ప్రభుత్వ వివరణతో ఈసీ ఏకీభవించింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి.

News March 22, 2024

CMను అరెస్ట్ చేయవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

image

CM పదవిలో ఉండి అరెస్టయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు. దీంతో CMను అరెస్ట్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లను మాత్రమే పదవిలో ఉండగా అరెస్ట్ చేయరాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరని పేర్కొన్నారు. PM, CMలను చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు.

News March 22, 2024

కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ రూపొందించనున్నారు. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారమిస్తారు. apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

News March 22, 2024

ఎల్లుండి తెలంగాణ బంద్

image

TG:ఈ నెల 24న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన <<12882117>>ఎన్‌కౌంటర్‌కు<<>> నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ‘ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. నలుగురిని పోలీసులు ప్రాణాలతో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన వారిని శిక్షించాలనే డిమాండ్‌తో బంద్ చేపడుతున్నాం’ అని రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు.