India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్బేస్లో కెమికల్ పౌడర్తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్కు గురువారం వచ్చిన పార్శిల్ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.

ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. IGIA ఎయిర్పోర్ట్ ATCలో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి కారణం. దీని వల్ల ఆన్బోర్డు, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. అత్యధిక విమానాల రాకపోకల్లో ఆలస్యం చర్చకు దారితీసింది. సమస్యను గుర్తించి పరిష్కరించామని, పరిస్థితి క్రమేణా సద్దుమణిగినట్లు ఎయిర్పోర్టు తెలిపింది. ఉత్తరాది ఎయిర్పోర్టులపైనా దీని ప్రభావం పడింది.

AP: e-KYC పూర్తి చేయించుకోని వారి రేషన్ కార్డులను రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ e-KYC చేయించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో చాలా మంది ఇంకా e-KYC చేయించుకోలేదని, డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే e-KYC పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.

Hong Kong Sixes 2025 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 6 ఓవర్ల మ్యాచులో ఏకంగా 148/2 చేసింది. కెప్టెన్ గుల్బదిన్ 12 బంతుల్లో 50, జనత్ 11 బంతుల్లో 46 రన్స్ చేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్స్ 400కు పైగానే ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 ఓవర్లలో 99 రన్స్ చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 25 సిక్సర్లు బాదారు.

ప్రతి జీవి కోరుకునేది ఆనందం. దాన్ని పొందడానికి మనిషి 2 విషయాలు చేస్తాడు. మొదటిది కోరుకున్న వాటిని పొందడం. అంటే మంచి చదువు, ఉద్యోగం, ఐశ్వర్యం. రెండోది ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం. అంటే అనారోగ్యం, అప్పులు అన్నమాట. ఈ రెండు కోరికలు నెరవేరడానికి ఏం చేయాలో వేదాలు బోధిస్తాయి. వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడమే కాక, కోరికలను నెరవేర్చుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి పరిష్కారం చూపుతాయి. <<-se>>#VedikVibes<<>>

AP: పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్టు Dy CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెపండగ 2.0లో 4007 KM రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణాలు నాణ్యతతో ఉండాలన్నారు. స్వమిత్వ పథకం ద్వారా గ్రామాల్లో MARకి కోటి మంది ఆస్తులకు యాజమాన్య హక్కు (ప్రాపర్టీ) కార్డులు అందించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.