India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాన్వెజ్ ప్రియులు మటన్ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.
TG: గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన <<16075233>>రాకేశ్ రెడ్డి<<>>కి పరువు నష్టం దావా నోటీసులిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట ‘బ్లూ మూన్’ అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బిసన్’ అనే సినిమా చేస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తమ దేశంలోని కీవ్లో ఉన్న భారత్కు చెందిన ఓ ఫార్మా గోడౌన్పై రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్తో మైత్రి ఉందని చెబుతూనే ఉద్దేశపూర్వకంగా ఆ దేశ వ్యాపారాలను మాస్కో టార్గెట్ చేస్తోందని INDలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ దాడితో పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులు నాశనం అయినట్లు వివరించింది. కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై భారత్, రష్యా ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.
AP: ఇవాళ రాష్ట్రంలోని 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. అలాగే 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలంది. స్థానిక వాతావరణం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలని సూచించింది.
SRH ఓపెనర్లు అద్భుతంగా ఆడారని, తాను ఇప్పటి వరకు చూసిన ఇన్నింగ్స్లలో అభిషేక్ బ్యాటింగ్ అత్యుత్తమమని SRHతో ఓటమి తర్వాత PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొనియాడారు. 245రన్స్ను 9బంతులు మిగిల్చి ఛేదించడం చూస్తే నవ్వొస్తోందని చెప్పారు. అభిషేక్ అదృష్టవంతుడని, అతని క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత చెలరేగి ఆడాడని తెలిపారు. తొలుత 230స్కోర్ చేస్తే గెలుస్తామని భావించినా, 2వ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపిందన్నారు.
1919: పంజాబ్ జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల్లో 379 మంది ఉద్యమకారులు మృతి
1999: నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం
1999: ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
* జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
ఏప్రిల్ 13, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.