India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: యూరియా కొరత ఉందంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టింది. పలు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించిన YCP నేతలు యూరియా కొరతపై అధికారులకు వినతులు సమర్పించారు. ‘యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలి. బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.
హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తిలో వాటా కోరుతున్నారు. రూ.30,000 కోట్ల విలువ చేసే సోనా గ్రూపులో తమకూ హక్కు ఉందని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా సంజయ్, కరిష్మా 2016లో విడిపోయారు. వీరిద్దరికీ సమీరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు సోనా గ్రూపును దక్కించుకునేందుకు సంజయ్ మూడో భార్య ప్రియా సచ్దేవ్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.
నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.
హనుమంతుడు భక్తి తత్పరుడు. ఆయన విగ్రహాలు, జెండా అన్ని నారింజ రంగులోనే దర్శనమిస్తాయి. ఓరోజు సీతాదేవి నుదుటన ఆంజనేయుడు కుంకుమను గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని అడిగాడు. అప్పుడు జానకీ దేవి ఆ సిందూరం శ్రీరాముని దీర్ఘాయువుని సూచిస్తుందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా రాముడిపై అంతులేని ప్రేమతో తన దేహమంతటా ఆ సిందూరాన్ని పూసుకున్నాడు.
మరణం తర్వాత కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేన్ని తాకినా, అది బంగారంగా మారిపోసాగింది. ఆహారం తిందామన్నా ఇదే పరిస్థితి. దీంతో ‘నేనేం తప్పు చేశా’ అని బాధపడ్డాడు. అప్పుడు అశరీరవాణి ‘కర్ణా! నీవు దానశీలిగా ఎవరికి ఏం కావాలన్నా కాదనకుండా ఇచ్చావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, డబ్బు రూపేణా చేశావు. కానీ, ఒక్కసారైన అన్నదానం చేశావా? ఎవరి ఆకలినైనా తీర్చావా? అందుకే ఈ దుస్థితి’ అని పలికింది.
తనకు కల్గిన దుస్థితి నుంచి విముక్తి కలిగించమని తండ్రి సూర్యుని వద్దకు వెళ్లి అడిగాడు కర్ణుడు. సూర్యుడి కోరిక మేరకు ఇంద్రుడు కల్పించుకొని కర్ణుడికి అవకాశం ఇచ్చాడు. భూలోకానికి వెళ్లి అన్నదానం చేయమన్నాడు. కర్ణుడు భూమ్మీదకు వెళ్లి అన్నదానం చేసి, మాతా పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి స్వర్గానికి వెళ్లాడు. అప్పుడే ఆయన ఆకలి తీరింది. అయితే కర్ణుడు భూమ్మీద గడిపిన ఈ 15 రోజుల కాలాన్నే మహాలయ పక్షమని అంటారు.
1. రామాయణంలో సుగ్రీవుడి భార్య ఎవరు?
2. మహాభారతం అసలు పేరేంటి?
3. గుజరాత్ రాష్ట్రంలో ఏ పండగను నూతన సంవత్సరంగా నిర్వహిస్తారు?
4. వైశాఖ తృతీయను మనం ఏమని పిలుస్తాం?
5. నారదుని వీణ పేరేంటి?
6. ‘బ్లాక్ పగోడా’ అని ఏ దేవాలయాన్ని అంటారు?
మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఒక టన్ను పశువుల ఎరువును ఎకరం పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19KGల పొటాష్, ఇతర పోషకాలు పంటకు అందుతాయి. ఒక టన్ను గొర్రెల, మేకల ఎరువు వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్, ఇతర పోషకాలు మొక్కలకు చేరతాయి. ఫలితంగా భూమిలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతో భూసారం పెరుగుతుంది.
ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
Sorry, no posts matched your criteria.