News July 4, 2025

సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

image

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించింది.

News July 4, 2025

వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా?: KTR

image

TG: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన భయానకమని మాజీ మంత్రి KTR అన్నారు. ఈ ఘటనలో మృతుల శరీర అవశేషాలను కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని విమర్శించారు. SLBC ఘటనలో పరిహారం కోసం 8 కుటుంబాలు వేచి చూస్తున్నాయని, వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు.

News July 4, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా? లేదా?

image

AP: మొహర్రం సందర్భంగా రేపటి ఆప్షనల్ హాలిడేపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ ఆప్షనల్ సెలవును స్కూళ్లు వాడుకోవచ్చా? లేదా? అనే సందిగ్ధత నెలకొందని, విద్యాశాఖ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత వారంలో రథయాత్రకు సెలవు ప్రకటించి, చివరి నిమిషంలో రద్దు చేశారని పేర్కొంటున్నాయి. రేపటి ఆప్షనల్ సెలవుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాయి.

News July 4, 2025

US ఇండిపెండెన్స్ డే.. క్రాకర్స్‌పై $2.8B ఖర్చు?

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా సిద్ధమైంది. 1776లో ఇదే రోజున బ్రిటిష్ పాలకుల నుంచి ఆ దేశం విముక్తి పొందింది. 249వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అమెరికన్లు సంబరాలు చేసుకోనున్నారు. జాతీయ జెండాలతో అలంకరణలు, పరేడ్‌లు నిర్వహిస్తారు. హాలిడే కావడంతో కుటుంబ సభ్యులంతా ఓ చోటకు చేరుకోనున్నారు. అయితే సెలబ్రేషన్స్ కోసం అమెరికన్లు ఒక్కరోజే $2.8 బిలియన్లు ఖర్చు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.

News May 8, 2025

శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు

image

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్‌గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.

News May 8, 2025

లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి

image

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.

News May 8, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

image

ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపరుచుకోనుంది.
DC: డుప్లెసిస్, పోరెల్, KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, మాధవ్ తివారీ, స్టార్క్, చమీరా, కుల్దీప్, నటరాజన్
PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, అజ్మతుల్లా, చాహల్

News May 8, 2025

పాకిస్థాన్ నాటకాలు ఆపాలి: నిక్కీ హేలీ

image

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’‌కు ఐక్యరాజ్య సమితిలో US మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ మద్దతు ప్రకటించారు. ‘టెర్రరిస్టులు డజన్ల కొద్దీ భారతీయులను చంపారు. ప్రతీకారం తీర్చుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఇండియాకు హక్కు ఉంది. తాము బాధితులమంటూ పాకిస్థాన్ చేసే నాటకాలు ఆపాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ దేశమూ సపోర్ట్ చేయకూడదు’ అని ట్వీట్ చేశారు.

News May 8, 2025

IPL: భారత ఆర్మీకి బీసీసీఐ సంఘీభావం

image

పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు ధర్మశాలలో భారత సైన్యానికి బీసీసీఐ సంఘీభావం తెలియజేసింది. నిన్న పాక్ విచక్షణ రహిత దాడిలో మరణించిన సైనికుడికి నివాళి తెలిపింది. ఈ క్రమంలో ఓ బృందం జాతీయ జెండాలతో మైదానంలో తిరగడంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించింది.

News May 8, 2025

మేం తలచుకుంటే ప్రపంచ పటంలో ఉండరు: రేవంత్

image

TG: దాయాది దేశం పాకిస్థాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత సైన్యానికి సంఘీభావంగా చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మేం తలచుకుంటే పాక్ ప్రపంచ పటంలో ఉండదు. మట్టిలో కలిపేస్తాం. కానీ సంయమనం పాటిస్తున్నాం. మీకు స్వాతంత్ర్యం ఇచ్చింది మేమే. మా దేశ సిందూరాన్ని మీరు తుడిచివేయాలని అనుకుంటే ఆపరేషన్ సిందూర్‌తో మీకు బదులిచ్చాం’ అని పేర్కొన్నారు.