India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ ప్రియులకు ఇవాళ బిగ్ అప్డేట్స్ రానున్నాయి. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నెక్ట్స్ మూవీ అనౌన్స్మెంట్ రానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఉ.11 గంటలకు ఈ ప్రకటన రానుంది. మరోవైపు ‘ఏజెంట్’ తర్వాత రెండేళ్లుగా సినిమా ప్రకటించని అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ రానుంది. ఆయన బర్త్ డే నేపథ్యంలో ఇవాళ టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
AP: ఆరోగ్య శ్రీ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిన్న నిలిపివేయడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రూ.500 కోట్ల బకాయిలు తక్షణం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. అటు ఈ నెల 10 తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.
TG: టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. యువత భారీ ఎత్తున హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2KGల గృహ వినియోగ సిలిండర్పై ₹50 పెంచుతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించగా, ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలోని విజయవాడలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875 అయ్యింది. HYDలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.
AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.
ఏపీ, టీజీ రాష్ట్రాల్లో 82% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించి రిపోర్టును వెల్లడించింది. 81% మందిలో విటమిన్-D లోపం ఉందని, ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్-1 ఫ్యాట్ లివర్ సంకేతాలు ఉన్నాయని తెలిపింది. 77శాతం మహిళల్లో పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో 28% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొంది.
AP: గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా గంజాయి లేదా డ్రగ్స్కు సంబంధించిన కేసుల దర్యాప్తు అధికారం ఈ పీఎస్ పరిధిలో ఉంటుందని అందులో పేర్కొంది. స్టేషన్ హెడ్గా డీఎస్పీ స్థాయి అధికారి ఉండనున్నారు.
AP: ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
IPLలో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో KKR, LSG తలపడనుండగా రాత్రి 7.30 గంటలకు ముల్లాన్పూర్లో PBKS, CSK బరిలోకి దిగనున్నాయి. LSG, KKR రెండూ విజయాల బాటలోనే ఉండటంతో ఆ మ్యాచ్ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో మ్యాచ్లో చెన్నై ఈరోజైనా గెలుస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్లో నెలకొంది. ఈ మ్యాచుల్లో ఎవరు గెలవచ్చు? కామెంట్స్లో చెప్పండి.
ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారన్న వదంతులు వచ్చాయి. వాటిని ట్రంప్ కొట్టిపారేశారు. ‘మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు. కానీ చర్చలకు రావాలనుకునే ఏ దేశంతోనైనా సరే మాట్లాడేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో భేటీ అయ్యారు. ఇటు భారత్ కూడా ఆ విషయంలో అమెరికాతో చర్చల్లో ఉంది.
Sorry, no posts matched your criteria.