India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: HYD స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSతో ఒప్పందంలో భాగంగానే BJP నామినేషన్ దాఖలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘ఈ ఎన్నికల్లో 112 ఓట్లు ఉన్నాయి. ఇందులో BJPకి 27, BRSకు 23, MIMకు 49 ఉన్నాయి. మాకు 13 మాత్రమే ఉండటంతో పోటీ చేయలేదు. బలం లేని బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి BRSకు బినామీగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది’ అని ట్వీట్ చేశారు.
‘అర్జున్ S/O వైజయంతి’ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం 10KGల బరువు తగ్గినట్లు విజయశాంతి చెప్పారు. నాన్వెజ్ మానేసి స్పెషల్ డైట్, వర్కవుట్లు చేసినట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పోలీస్ పాత్ర అనగానే కర్తవ్యం, వైజయంతి సినిమాలు గుర్తుకొస్తాయి. అప్పటి లుక్తో పోల్చుతారు. అందుకే కష్టమైనా సరే బరువు తగ్గా’ అని వివరించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
AP: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అవనిగడ్డ మండలం కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు చనిపోయారు. మృతులను మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15)గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా MA బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులో నిర్వహిస్తున్న పార్టీ మహాసభల్లో నేతలంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశలో కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరికతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బేబీ 1986 నుంచి 1998 వరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కేరళ మంత్రిగానూ సేవలందించారు. సీతారాం ఏచూరి మరణంతో ఇంతకాలం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది.
పుష్ప-2 తర్వాత రెస్ట్ మోడ్లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఎల్లుండి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. నిర్మాత బన్నీ వాస్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘APR 8న షాకింగ్ సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొనడంతో ఐకాన్ స్టార్- అట్లీ మూవీ గురించేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ రోజు టెక్నీషియన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.
TG: HCU భూముల వివాదంపై ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు KTR బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, HCU రక్షణకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 400 ఎకరాల భూమి ప్రమాదంలో పడిందని, ఆర్థిక లాభం కోసం ప్రభుత్వం పర్యావరణంపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఆ భూముల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 రకాల జంతువులు ఉన్నాయన్నారు.
AP: మాజీ Dy.CM అంజద్ బాషా సోదరుడు అహ్మద్ అరెస్టయ్యారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. TDP MLA మాధవీరెడ్డిని దూషించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలోనూ దాడి కేసు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇరువర్గాలు రాజీ పడినప్పటికీ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేసినట్లు YCP వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు.
AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.
Sorry, no posts matched your criteria.