India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ఫేమస్ హిందీ టీవీ షో ‘సీఐడీ’ తెలుగులోనూ చాలామందికి సుపరిచితమే. ఇందులో ప్రధాన పాత్రధారి ఏసీపీ ప్రద్యుమన్ మృతిచెందారని సోనీ టీవీ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన చాలామంది పాత్ర పోషించిన శివాజీ సాటమ్ చనిపోయారనుకుని పొరబడ్డారు. షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన శివాజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.
వక్ఫ్ బోర్డుల్లో నిబంధనల ఉల్లంఘనకు కాంగ్రెస్ ఉదారతే కారణమని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. భారీ స్థాయిలో జరిగిన భూకబ్జాలకు వక్ఫ్ సవరణ బిల్లు పరిష్కారం చూపుతుందన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో భారీ కుట్ర ఉందని ఆరోపించారు. దాంతో ఇప్పటికీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఏ ఒక్క వ్యక్తి, కమ్యూనిటీ లేదా సంస్థ చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొన్నారు.
IPL: చెన్నై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో 5 నెమ్మదైన హాఫ్ సెంచరీల్లో 3 CSK ఆటగాళ్లవే కావడం గమనార్హం. విజయ్ శంకర్ 43, రచిన్ 42, జైస్వాల్ 40, లివింగ్స్టోన్ 39, గైక్వాడ్ 37 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. అటు నిన్న ధోనీ క్రీజులోకి వచ్చిన 19 బంతుల తర్వాత బౌండరీ బాదారు. మ్యాచులు ఓడిపోవడం సహజం అని, అయితే చెన్నై బ్యాటర్లలో గెలవాలన్న కసి కనిపించట్లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో అన్ని వస్తువులపై రేట్లు పెరుగుతాయన్న ఆందోళన అమెరికావ్యాప్తంగా నెలకొంది. దీంతో జనాలు సూపర్ మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ దుకాణాల వరకూ పోటెత్తుతున్నారు. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, దుస్తులు, బూట్లు, కార్లు, విదేశీ ఆహారాలు, విద్యుత్ పరికరాలు.. ఇలా అన్ని రకాల వస్తువులకూ భారీ డిమాండ్ నెలకొంది. ఏ షాపింగ్ మాల్ చూసినా జనం భారీగా కనిపిస్తున్నారు.
* AP: అనకాపల్లి ఫార్మా సిటీలో ప్రమాదం.. విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
* తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. స్వామిని దర్శించుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా
* TG: శ్రీశైలం SLBCలో 43 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ
* శ్రీరామనవమి వేళ అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీ
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని పనుల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడవాడలా వేడుకలు కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన రాముడి చరిత్రను గుర్తు చేసుకుందామన్నారు.
TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో మండలానికి ఓ గ్రామం నుంచి మొత్తం 71 వేల మందిని ఎంపిక చేసింది. ఇప్పుడు మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం 4.50 లక్షల మందితో జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.