News April 6, 2025

నేడు వైన్ షాపులు బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వైన్ షాపులు మూతబడనున్నాయి. ఉ.10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపునిచ్చారు. అటు జిల్లాల్లో వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.

News April 6, 2025

ALERT: మరో 5 రోజులు వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

News April 6, 2025

చరిత్ర సృష్టించిన శాంసన్

image

IPL: నిన్న పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. షేన్ వార్న్‌ను వెనక్కినెట్టి RR మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచారు. మొత్తం 62 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయలేదు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్‌లోనే RRకు ట్రోఫీ అందించిన వార్న్ 55 మ్యాచ్‌ల్లో 31 విక్టరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

News April 6, 2025

వరుసగా 3 రోజులు సెలవులు

image

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అటు ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంది. 18న గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉండనుండగా, 30న బసవ జయంతి రోజున ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా పేర్కొంది.

News April 6, 2025

నేడు ఉత్తరాఖండ్‌కు పొన్నం, సీతక్క

image

TG: మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నేడు ఉత్తరాఖండ్‌కు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి డెహ్రాడూన్‌లో జరిగే చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొంటారు. BC సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై పొన్నం ప్రసంగించనున్నారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సీతక్క వివరించనున్నారు.

News April 6, 2025

కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!

image

భూ కక్ష్యలో శకలాల ముప్పు నానాటికీ మరింత పెరుగుతోంది. ఉపగ్రహాలు తిరిగే వేగం కారణంగా ఒక సెం.మీ పరిమాణం ఉన్న వస్తువు ఢీకొట్టినా విధ్వంసం వేరేస్థాయిలో ఉంటుంది. భూ కక్ష్యలో అలాంటివి 12 లక్షలకు పైగా ఉన్నాయి. వీటి వల్ల ఒక ఉపగ్రహం ధ్వంసమైనా అది మిగతా శాటిలైట్లన్నింటినీ ధ్వంసం చేయొచ్చు. అదే జరిగితే భూమిపై సాంకేతికత అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News April 6, 2025

పూరీ-విజయ్ సేతుపతి సినిమాలో టబు?

image

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో పాపులరైన ఆమెను సినిమాలోని ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

News April 6, 2025

రాములోరి కళ్యాణానికి వేళాయె..

image

TG: భద్రాద్రిలో శ్రీరామనవమి సందర్భంగా నేడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 9 గంటలకు కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తారు. 10.30-12.30గం. మధ్య కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి దేవతామూర్తులకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు.

News April 6, 2025

అధ్యక్ష బాధ్యతల వల్ల భార్యకు దూరమయ్యా: ఒబామా

image

ఒబామా అమెరికా అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు సేవలందించారు. ఆ సమయంలో తన భార్య మిషెల్‌కు దూరమయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అధ్యక్ష బాధ్యతల కారణంగా మిషెల్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయాను. దీంతో మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో మ్యారేజ్ కౌన్సిలర్‌ను కూడా కలిశాం. అధ్యక్షుడిగా దిగిపోయాక ఇప్పుడు ఆమెతోనే ఎక్కువ ఉంటున్నాను. మా బంధం మెరుగైంది’ అని వెల్లడించారు.

News April 6, 2025

తెలంగాణ కొత్త సీఎస్ ఆయనేనా?

image

TG: సీఎస్ శాంతికుమారి ఈనెలాఖరున రిటైర్ కానున్న నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐఏఎస్ రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని CM రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో సుదీర్ఘ అనుభవం, రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకుంటారని, ఆమెకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.