India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమ చెల్లింపుల కేసులో కేరళ CM పినరయి విజయన్ కూతురు వీణను విచారించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి సేవలు అందించకపోయినా ఆమెకు చెందిన ఎక్సలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు కొచ్చిన్ మినరల్స్&రూటైల్ లిమిటెడ్ నుంచి రూ.2.73కోట్ల చెల్లింపులు జరిగినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. దీని ఆధారంగా వీణతో పాటు ఇతర నిందితులపై విచారణకు కేంద్రం ఆదేశించింది.
TG: HYD ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవకముందే.. రక్సెల్-SEC ఎక్స్ప్రెస్లో ఓ బాలిక(12)పై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆ రైళ్లో ప్రయాణిస్తున్న బాలిక అర్ధరాత్రి వేళ వాష్రూమ్కు వెళ్లగా, వెనకాలే ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అరగంట పాటు ఆమెను లైంగికంగా వేధించి వీడియోలు తీశారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
యూఎస్లోని కాన్సాస్ స్టేట్లో భారత సంతతి క్యాథలిక్ ఫాదర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. పలువురు దుండగులు ఆయనను తుపాకీతో షూట్ చేసి చంపేశారు. అక్కడి సెయింట్ మేరీ చర్చి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఘటనకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా హైదరాబాద్కు చెందిన అరుల్ 2004లో కాన్సాస్కు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఎన్నో చర్చిల్లో ఆయన సేవలందించారు.
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,600 తగ్గి రూ.84వేలుగా పలుకుతోంది. అటు వెండి కేజీ రూ.4,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000కు చేరింది.
రహానేతో వివాదం వల్లే జైస్వాల్ <<15971972>>ముంబైను వీడాలని<<>> నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2022 రంజీ మ్యాచ్లో బ్యాటర్ను స్లెడ్జింగ్ చేస్తున్నాడని జైస్వాల్ను రహానే ఫీల్డ్ నుంచి పంపించారు. ఇదే వీరి మధ్య వివాదానికి బీజం వేసినట్లు సమాచారం. షాట్ సెలక్షన్, జట్టుపై నిబద్ధత పట్ల రహానే తరచూ ప్రశ్నించడమూ జైస్వాల్కు నచ్చలేదని.. 2025 రంజీ మ్యాచ్లో రహానే కిట్ను జైస్వాల్ తన్నడంతో వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 691 పాయింట్లు కోల్పోయి 75,603, నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 22,972 వద్ద ట్రేడవుతున్నాయి. HDFC, TCPL, HUL, AIRTEL షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ONGC, TATA MOTORS, CIPLA షేర్లు ఎరుపెక్కాయి.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 58,864 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది.
ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ చరిత్ర సృష్టించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టు PBKS-21, RCB-20, SRHపై 20 విజయాలు సాధించింది. నిన్న SRHతో జరిగిన మ్యాచులో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. కాగా సన్రైజర్స్పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరుచుకోవద్దని అమెరికా తమ దేశ ఉద్యోగస్థులను హెచ్చరించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇటీవల చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
TG: రాష్ట్రంలో జూ.కాలేజీలకు సంబంధించిన 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూన్ 2 నుంచి కాలేజీలు ప్రారంభం కానుండగా, మొత్తం 226 పనిదినాలు ఉండనున్నాయి. SEP 28 నుంచి OCT 5 వరకు దసరా సెలవులు, 2026 JAN 11 నుంచి 18 వరకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. JAN లాస్ట్ వీక్లో ప్రీఫైనల్ పరీక్షలు, FEB మొదటి వారంలో ప్రాక్టికల్స్, మార్చి ఫస్ట్ వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మార్చి 31 చివరి వర్కింగ్ డే.
Sorry, no posts matched your criteria.