News April 3, 2025

SRHకు బిగ్ షాక్

image

IPLలో SRH తీరు మారడం లేదు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 4 రన్స్ కొట్టి హెడ్ ఔట్ కాగా తర్వాతి ఓవర్‌లో అభిషేక్ 2 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్(2) కూడా క్యాచ్ ఔట్ అయ్యారు. దీంతో 201 రన్స్ భారీ టార్గెట్ ఛేదనలో SRH 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

News April 3, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, HYD, VKB, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు సహా మరికొన్ని జిల్లాల్లో పడిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు, ఎల్లుండి కూడా <<15974523>>వర్షాలు <<>>కురుస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని, సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి.

News April 3, 2025

కంచ భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు

image

TG: గచ్చిబౌలి కంచ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించింది. HCU, విద్యార్థులు, ప్రజాసంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. కాగా భూముల్లో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

News April 3, 2025

RGVపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

image

AP: డైరెక్టర్ RGVకి<<15667800>> హైకోర్టులో<<>> ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవి రాజకీయ దురుద్దేశంతో పెట్టినవని, కొట్టేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులపై ఇప్పటికే స్టే విధించిన కోర్టు ఇవాళ మరోసారి విచారించింది.

News April 3, 2025

ఎయిర్‌ట్యాక్సీ రూపొందించిన అభిరామ్.. సీఎం అభినందన

image

AP: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించిన గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ CEO చావా అభిరామ్‌ను CM చంద్రబాబు అభినందించారు. తాను రూపొందించిన ట్యాక్సీ వివరాలు, ఫీచర్స్, ఖర్చు వంటివి సీఎంకు ఆయన వివరించారు. ప్రస్తుతం 2 సీట్ల సామర్థ్యంతో రూపొందించానని అభిరామ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడతామని CM ఆయనకు హామీ ఇచ్చారు.

News April 3, 2025

BREAKING: SRHతో మ్యాచ్.. KKR భారీ స్కోర్

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో KKR 200/6 స్కోర్ చేసింది. డికాక్(1), నరైన్(7) విఫలమవగా రఘువంశీ 50, రహానే 38, చివర్లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60, రింకూ సింగ్ 17 బంతుల్లో 32* అదరగొట్టారు. షమీ, కమిన్స్, అన్సారీ, కమిందు మెండిస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

News April 3, 2025

డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

image

పెళ్లి, డేటింగ్‌ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.

News April 3, 2025

ఇతడి కోసమే ముగ్గురు పిల్లల్ని చంపేసింది!

image

TG: ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా <<15966011>>హత్య<<>> చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది. అయితే పిల్లలు లేకుంటేనే చేసుకుంటానని అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది.

News April 3, 2025

నాపై గృహ హింస కేసు కొట్టేయండి: హన్సిక పిటిషన్

image

తనతోపాటు తల్లిపై నమోదైన <<15080954>>గృహ హింస కేసును<<>> కొట్టేయాలంటూ హీరోయిన్ హన్సిక బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. అత్లింట్లో తనను వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు ₹20L, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని హీరోయిన్ డిమాండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

News April 3, 2025

మరో వివాదంలో నిత్యానంద!

image

సజీవ సమాధి అయ్యారంటూ వార్తల్లో నిలిచిన <<15965534>>నిత్యానంద<<>> మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈక్వెడార్ సమీపంలో ‘కైలాస’ దేశం ఏర్పాటుచేసుకున్న ఆయన కన్ను బొలీవియాపై పడినట్లు సమాచారం. నిత్యానంద అనుచరులు 20మంది $2లక్షలకు ఓ ప్రాంతాన్ని 25ఏళ్ల లీజుకు తీసుకునేందుకు స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు. వెయ్యేళ్ల లీజుకు ప్రయత్నించగా విషయం బయటికొచ్చింది. దీంతో GOVT వారిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు(IND, చైనా, US) పంపింది.