News April 3, 2025

IPL: టాప్‌-3లో ధోనీ, కోహ్లీ, రోహిత్

image

మార్చిలో Xలో అత్యధికంగా ప్రస్తావించిన ఐపీఎల్ ప్లేయర్ల లిస్టులో CSK మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. నెటిజన్లు గత నెలలో ఆయన గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, SRH హిట్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.

News April 2, 2025

అదంతా అబద్ధం: సూర్య కుమార్

image

<<15971972>>జైస్వాల్‌తో పాటు<<>> తాను కూడా ముంబై నుంచి గోవా జట్టుకు మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్య కుమార్ యాదవ్ ఖండించారు. ‘మీరు జర్నలిస్టులా? స్క్రిప్ట్ రైటర్లా? నేను కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇక నుంచి మీ ఆర్టికల్స్ చదువుతా’ అంటూ X వేదికగా స్పందించారు. సూర్యతో పాటు మరికొంత మంది క్రికెటర్లు గోవా జట్టులో చేరుతారని, HYD క్రికెటర్ తిలక్ వర్మనూ గోవా క్రికెట్ అసోసియేషన్ సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.

News April 2, 2025

UPI పేమెంట్స్ చేసేవారికి మళ్లీ షాక్

image

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్‌లో యూపీఐ పేమెంట్స్ మరోసారి నిలిచిపోయాయి. గతవారం కూడా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ కాగా ఇవాళ సాయంత్రం నుంచి పేమెంట్స్ కావడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో పంపుతున్న డబ్బులు ప్రాసెసింగ్‌లో పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

News April 2, 2025

ఛత్రపతి శివాజీ 100శాతం లౌకికవాది: గడ్కరీ

image

ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు గెలిచారు కానీ ఎప్పుడూ ఏ మసీదునూ కూల్చలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ‘ఛత్రపతి శివాజీ నిజమైన పాలకుడికి, తండ్రికి ప్రతీక. ఆయన వందశాతం లౌకికవాది. చాలామంది పెద్ద నాయకులవ్వగానే కులం, మతం గురించి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం సరికాదని నేను చాలామందిని హెచ్చరిస్తుంటాను’ అని తెలిపారు.

News April 2, 2025

RTC ఉద్యోగుల పిల్లలకు ర్యాంకులు.. సజ్జనార్ సన్మానం

image

TG:గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన TGSRTC ఉద్యోగుల పిల్లలను సంస్థ MD సజ్జనార్ సన్మానించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ శ్రీనివాస్ కుమార్తె వీణ 118వ ర్యాంక్, TI-2గా పనిచేస్తున్న వాహిద్ కుమార్తె ఫాహిమినా 126వ ర్యాంక్, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ పుష్పలత కుమారుడు రాఘవేందర్ 143వ ర్యాంకులు సాధించారు. RTC ఉద్యోగుల పిల్లలు రాణించడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.

News April 2, 2025

వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

AP: ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌’, ‘వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్’ సంకల్పాల్ని నిజం చేసేందుకు అందరూ ముందుకురావాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘AP నుంచి కొత్తగా పారిశ్రామిక వేత్తలు రావాలి. ఆవిష్కరణలకు AP హబ్ కావాలి. అందరిలోనూ స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్‌ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టాం. వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్స్ స్థాపించడమే లక్ష్యం’ అని పేర్కొన్నారు.

News April 2, 2025

మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

image

TG: మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూసీకి 50మీటర్ల వరకు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టవద్దని, 50-100 మీటర్ల వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జేఎండీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

News April 2, 2025

IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

image

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.

News April 2, 2025

లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

image

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.

News April 2, 2025

CBSE, ICSE 10, 12 ఫలితాలు ఎప్పుడంటే?

image

దేశ వ్యాప్తంగా CBSE, ICSE 10, 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం కొనసాగుతుండగా మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో CBSE 10, 12వ తరగతి ఫలితాలు మే నెలలోనే రిలీజ్ కాగా, ఈ సారి అదే సమయంలో వచ్చే ఛాన్సుంది. ICSE సైతం మేలోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయ్యాక ఫలితాల విడుదల తేదీలపై ఆయా బోర్డులు ప్రకటన చేయనున్నాయి.