News March 30, 2025

పేదలూ సన్న బియ్యం తినాలనేది మా ఆకాంక్ష: సీఎం

image

TG: దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని CM రేవంత్ వెల్లడించారు. HYDకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ శ్రీమంతుల మాదిరే పేదలూ సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 1.56L మె.టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.

News March 30, 2025

APPLY: నెలకు రూ.5,000.. రేపే చివరి తేదీ

image

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన PM ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దాదాపు 350 కంపెనీల్లో లక్షన్నర మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కేంద్రం కల్పించనుంది. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ(6 నెలలు క్లాస్‌రూమ్+6 నెలలు ఫీల్డ్‌ ట్రైనింగ్) ఉంటుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ₹6Kతోపాటు ప్రతినెలా ₹5K చొప్పున ఇవ్వనుంది.
వెబ్‌సైట్: https://pminternship.mca.gov.in/

News March 30, 2025

ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా

image

TG: రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, మెడిసన్ ఖర్చులన్నీ కలిపి ఆ మొత్తానికి ఉచిత వైద్యం పొందొచ్చు. ఈ స్కీమ్ అమలుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు TGలోని 416 నెట్‌వర్క్ ఆస్పత్రులకు తాజాగా ఆదేశాలిచ్చారు.

News March 30, 2025

ఉగాది కానుక.. CMRF దస్త్రంపై చంద్రబాబు సంతకం

image

AP: పేదలకు సాయంపై ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల అయ్యాయి. మరోవైపు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు.

News March 30, 2025

హార్దిక్‌ పాండ్యకు మరో షాక్!

image

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.

News March 30, 2025

నేను, భట్టి జోడెద్దుల్లా పని చేస్తున్నాం: రేవంత్

image

TG: జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని CM రేవంత్ అన్నారు. తాను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ‘కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుంది. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయి. అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటాం. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదు’ అని ఉగాది వేడుకల కార్యక్రమంలో అన్నారు.

News March 30, 2025

అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది: సీఎం చంద్రబాబు

image

AP: జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని CM చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, వారు తిరిగి సమాజానికి ఇవ్వాలని కోరారు. 20 ఏళ్ల క్రితమే IT ప్రాముఖ్యత చెప్పానని, తన మాట విని IT వైపు వెళ్లిన వారు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులని CM వివరించారు.

News March 30, 2025

రేపు, ఎల్లుండి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు రంజాన్ పండుగ జరుపుకోనుండటంతో ప్రభుత్వ బడులు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. APలో రేపు ఒక్క రోజే హాలిడే ఇవ్వగా, TG సర్కారు రేపటితో పాటు APR 1న కూడా సెలవు ప్రకటించింది. బోనాలు, క్రిస్మస్, రంజాన్ తర్వాతి రోజు సెలవుగా ప్రకటించడం గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు, సౌదీలో నిన్న నెలవంక కనిపించగా అక్కడ ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు.

News March 30, 2025

గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పింది: సీఎం చంద్రబాబు

image

AP: ‘ప్రజలే ముందు’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో కళ తప్పిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. ఒక్కో చిక్కుముడిని వదిలించుకుంటున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

News March 30, 2025

నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం: చంద్రబాబు

image

AP: ఉగాది.. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. 25ఏళ్లలో అమెరికన్ల కంటే రెండింతల ఆదాయాన్ని తెలుగుజాతి సంపాదించింది. నాగరికత, సంస్కృతి మరిచిపోతే ఉనికిని కోల్పోతాం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. కూటమి ప్రభుత్వం నాగరికత, సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తోంది’ అని అన్నారు.