India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.
భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
TG: వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. ఘట్కేసర్ ట్రాఫిక్ PSలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ డేవిడ్(31) నిన్న మల్కాజ్గిరిలోని ఇంటికి వెళ్లారు. కాలనీలో గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్గా తనూజ(ముద్దమందారం) హౌస్లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో రెండు హౌస్లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.
ఇవాళ రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం మొదలు కానుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం లేకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. రూట్(100), బెతెల్(110) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. మరో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు చేశారు. బట్లర్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సుతో 62* రన్స్ బాదారు. మెన్స్ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ 7సార్లు 400+ స్కోర్ చేసింది. ఈ లిస్టులో సౌతాఫ్రికా(8) టాప్లో ఉంది.
TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.
ఎంపీలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికగా చూడొద్దని కోరారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని కోరారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.
TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగతావారు హాజరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను BRSలోనే ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పలువురు MLAలకు నోటీసులివ్వగా ఒకరిద్దరు ఆయనకు సమాధానమిచ్చినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.