India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం మొదలు కానుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం లేకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. రూట్(100), బెతెల్(110) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. మరో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు చేశారు. బట్లర్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సుతో 62* రన్స్ బాదారు. మెన్స్ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ 7సార్లు 400+ స్కోర్ చేసింది. ఈ లిస్టులో సౌతాఫ్రికా(8) టాప్లో ఉంది.
TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.
ఎంపీలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికగా చూడొద్దని కోరారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని కోరారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.
TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగతావారు హాజరైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను BRSలోనే ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పలువురు MLAలకు నోటీసులివ్వగా ఒకరిద్దరు ఆయనకు సమాధానమిచ్చినట్లు సమాచారం.
చాలామంది ఫోన్కు ఛార్జింగ్ పెట్టి బ్యాటరీ ఫుల్ కాగానే ఛార్జర్ను అలాగే సాకెట్లో వదిలేస్తారు. కానీ ఇలా చేయొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇలా చేస్తే వోల్టేజ్ పెరిగినప్పుడు ఛార్జర్ పేలిపోవచ్చు. అంతర్గత భాగాలు వేడెక్కి అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా ఛార్జర్ కొంత మేర విద్యుత్ ఉపయోగిస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. అన్ప్లగ్ చేయడం ఉత్తమం’ అని చెబుతున్నారు.
AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.
ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న క్రమంలో రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత అని, ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సూచించారు.
TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.
Sorry, no posts matched your criteria.