India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో 15మంది మావోయిస్టులను అంతం చేసినట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. అక్కడి గోగుండా కొండమీది ఉపంపల్లిలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఈరోజు ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం.
AP: TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు, పార్టీ నేతలు, కార్యకర్తలకు Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉమ్మడి APలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా 1982లో TDPని NTR స్థాపించారు. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలబడింది. భవిష్యత్తులోనూ మరింత నిబద్ధతతో ఇలాగే ప్రజలకు అండగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.
భారతీయుల వద్ద ఉన్న బంగారం కొన్ని దేశాల రిజర్వు బ్యాంకుల గోల్డ్ నిల్వల కంటే ఎక్కువని HSBC గ్లోబల్ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం భారతీయుల వద్ద 25వేల టన్నులకు పైగా బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.150 లక్షల కోట్లు. భారత్, US, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల రిజర్వు బ్యాంకుల్లోని బంగారం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. మున్ముందు ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది.
నిన్న సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 694 మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో 68 మంది మిస్సింగ్ అయినట్లు తెలిపాయి. ఈ విషాద ఘటనలో 1670 మంది గాయపడ్డారని వెల్లడించాయి. అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 1000 ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపంతో భవనాలు కుప్పకూలగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి.
TG: ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36-41 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ దాదాపు 17 ఏళ్లు కడుపు నొప్పి భరించాల్సి వచ్చింది. యూపీలోని లక్నోకు చెందిన సంధ్యా పాండే అనే మహిళ పురిటి నొప్పులతో ఫిబ్రవరి 28, 2008న ‘షీ మెడికల్ కేర్’ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు సి-సెక్షన్ ఆపరేషన్ చేయగా.. ఆ సమయంలో కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. ఇన్నేళ్లుగా కడుపు నొప్పి వస్తుండటంతో KGMU ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయించడంతో అసలు విషయం బయటపడింది.
AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా. తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. ‘‘అన్న’’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రక రోజున ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేశారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. 9 నెలల్లోనే 294 అసెంబ్లీ సీట్లలో 202 గెలుచుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పది సార్లు ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు అధికారంలో, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉంది.
జలియన్వాలా బాగ్ ఘటనపై UK సర్కారు భారత్కు క్షమాపణలు చెప్పాలని ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్మన్ డిమాండ్ చేశారు. ‘2019లో అప్పటి పీఎం థెరెసా ఆరోజును గుర్తించారు కానీ క్షమాపణలు చెప్పలేదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రలోనే ఈ ఘటన మాయని మచ్చ’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 13, 1919న జలియన్వాలా బాగ్లో ఈస్టిండియా సర్కారు ఘోర మారణకాండకు పాల్పడింది. వేలాదిమంది అమాయక పౌరుల్ని మైదానంలోనే కాల్చి చంపించింది.
తన సోషల్ మీడియా సంస్థ X(ట్విటర్)ను తన AI కంపెనీ xAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం xAI $45B చెల్లించనుంది. $12B అప్పు పోగా X విలువ $33Bగా ఉండనుంది. xAI వాల్యూ $80B అని మస్క్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, కలిసి పని చేస్తాయని తెలిపారు. ఈ కంబైన్డ్ కంపెనీ యూజర్లకు జ్ఞానంతో పాటు ఉపయోగకరమైన అనుభవాలను ఇస్తుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.