News November 6, 2025

విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

image

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News November 6, 2025

మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

image

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.

News November 6, 2025

ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

image

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ముగిసిన తొలి విడత పోలింగ్

image

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.

News November 6, 2025

‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

image

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.

News November 6, 2025

ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్‌ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.

News November 6, 2025

ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక పెళ్లి?

image

విజయ్ దేవరకొండ-రష్మికల వివాహం వచ్చే ఏడాది FEB 26న(26-2-26) జరగనున్నట్లు సమాచారం. రాజస్థాన్ ఉదయ్‌పూర్ కోట వేదికగా వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా OCT 3న వీరి <<17907469>>ఎంగేజ్‌మెంట్<<>> పూర్తయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు కుటుంబాలు స్పందించకపోయినా ఇద్దరూ చేతి వేళ్లకు రింగ్స్‌తో కనిపిస్తున్నారు. ‘గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్, ఓ టాక్ షోలోనూ ‘నేషనల్ క్రష్’ పరోక్షంగా <<18124449>>నిశ్చితార్థంపై<<>> హింట్ ఇచ్చారు.

News November 6, 2025

BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా(BECIL)9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PWBDలకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:
www.becil.com/Vacancies

News November 6, 2025

బడికిరాని విద్యార్థులను తిరిగి తీసుకువచ్చే బాధ్యత CRPలదే: DSE

image

AP: బడికిరాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు తిరిగి స్కూళ్లకు వచ్చేలా CRPలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వెబ్‌ఎక్స్ మీటింగ్‌లో కమిషనర్ సమీక్షించారు. స్కూళ్లకు రాని వారికి హాజరు వేసినట్లు గుర్తిస్తే టీచర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. SSC పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. దీన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.