News May 7, 2025

రూ.10లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ!

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల నికర విలువకు చేరుకున్న కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. కంపెనీ వార్షిక లాభాలు రూ.69,646 కోట్లుగా నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో రూ.19,407కోట్ల ఆదాయాన్ని కంపెనీ గడించింది. సంస్థ అప్పులు రూ.3.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ లాభం మార్చి త్రైమాసికంలో 25.7% వృద్ధితో రూ7,022 కోట్లకు పెరిగింది.

News May 7, 2025

మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం(D) ఎచ్చెర్ల(M) బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయంగా 1,29,178 మంది అకౌంట్లలో రూ.20,000 చొప్పున జమ చేస్తారు. అంతకుముందు ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News May 7, 2025

సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు

image

TG: విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు.15 నుంచి 20రోజుల వరకూ నిర్వహించే ఈ క్యాంపుల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. జిల్లా కలెక్టర్ల నిర్ణయం మేరకు శిబిరాలలో నేర్పించే అంశాలను నిర్ణయించారు. ఇది వరకూ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉన్న ఈ సమ్మర్ క్యాంపులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

News May 7, 2025

కోల్‌‘కథ’ మారేనా? ‘పంజా’బ్ విసిరేనా?

image

వరుస ఓటములతో ఢీలా పడిన KKR ఇవాళ పంజాబ్‌తో తలపడనుంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రా.7.30కు మ్యాచ్ మొదలవనుంది. కోల్‌కతాతో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని PBKS పైచేయి సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని రహానే సేన, జోరు కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో PBKS 5, KKR 7వ స్థానంలో ఉన్నాయి.

News May 7, 2025

ఇవాళ పోప్ అంత్యక్రియలు.. దేశాధినేతల హాజరు

image

వాటికన్‌సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రంప్, మెక్రాన్, స్టార్మర్, జెలెన్‌స్కీ, ద్రౌపదీ ముర్ము సహా 164 మంది దేశాల ప్రతినిధులు, అధినేతలు పాల్గొననున్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 21న ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2.50 లక్షల మంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.

News May 7, 2025

కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఏపీ వాసి

image

AP: తమిళనాడులో ప్రఖ్యాత కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా ఏపీ అన్నవరానికి చెందిన 27 ఏళ్ల పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న ఆయనకు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. ధన్వంతరి, మంగాదేవిల పెద్ద కుమారుడైన గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించారు. వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు. ఈయన కొన్ని రోజులు తెలంగాణ బాసరలోనూ సేవలందించారు.

News May 7, 2025

పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి: ఏపీ డీజీపీ

image

ఏపీలోని పాకిస్థానీలందరూ వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రేపటి తర్వాత ఆ దేశస్థులు రాష్ట్రంలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు <<16214062>>తెలంగాణ డీజీపీ జితేందర్<<>> కూడా పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

News May 7, 2025

భారత్, పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్

image

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ‘తమ సోదర దేశాలు ఇండియా, పాక్‌తో సంబంధాలను మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము. ఇలాంటి క్లిష్ట సమయంలో ఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య మంచి సంబంధాలు ఏర్పరచేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉంది’ అని ఇరాన్ విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. దీనిపై ఇటు భారత్ కానీ, అటు పాక్ కానీ ఇంకా స్పందించలేదు.

News May 7, 2025

అతడితో నా అనుబంధం ప్రత్యేకం: సమంత

image

కోలీవుడ్ నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డుల్లో సమంత గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తన అనుబంధాన్ని ఆమె తెలిపారు. ‘నేను ఆస్పత్రిపాలైనప్పుడు నా వెంటే ఉన్నాడు. రోజంతా అక్కడే ఉండి నా బాగోగులు చూసుకున్నాడు. అతడు నాకు ప్రత్యేకం. నా ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్, బంధువా అని చెప్పలేకపోతున్నా. మా అనుబంధానికి పేరు పెట్టలేకపోతున్నా’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News May 7, 2025

కశ్మీరీ పండిట్లు, రైల్వే ఆస్తులే ఉగ్రమూకల లక్ష్యం!

image

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీరీ పండిట్లతోపాటు అక్కడ పనిచేసే స్థానికేతరులు, రైల్వే ఆస్తులను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అంచనా వేశాయి. పాక్ ISI ఆదేశాలతో దాడులు చేయొచ్చని గుర్తించాయి. ఈ మేరకు ఆయా వర్గాలను, భద్రతా సిబ్బందిని, RPFను అప్రమత్తం చేశాయి. దీంతో రైల్వే సిబ్బంది మార్కెట్లకు వెళ్లొద్దని, తమ బ్యారక్‌ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.