India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ సెక్టార్లో AI హ్యూమనాయిడ్ రోబోట్ను రూపొందించినట్లు న్యూక్లియర్ సంస్థ ఒరానో(ఫ్రాన్స్), టెక్నాలజీ కంపెనీ క్యాప్జెమినీ ప్రకటించాయి. హోక్సో అనే పేరు కలిగిన ఈ రోబోట్ ఏఐ, నావిగేషన్, టెక్నికల్ ఆదేశాల అమలు, అడ్వాన్స్డ్ సెన్సార్లను కలిగి ఉందని తెలిపాయి. న్యూక్లియర్ కేంద్రాల్లో మానవులతో కలిసి పనిచేస్తుందన్నాయి.

ఆనందం, సరదా కోసం ఆల్కహాల్ తీసుకుంటే కలిగే అనర్థాలను వివరిస్తూ వైద్యుడు శ్రీకాంత్ మిర్యాల చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘బాధలో బీరు తాగితే బోన్ మ్యారో దెబ్బతింటుంది. స్కాచ్ తాగితే సిర్రోసిస్తో రక్తం కక్కుకుని చనిపోతారు. రమ్ సేవిస్తే రక్తహీనత వస్తుంది. సారా తాగితే సరసానికి పనికిరాకుండా పోతారు. వోడ్కా వల్ల గవదలు వాచిపోతాయి. వైన్ తాగితే గర్భస్రావాలు. మందు మానరా.. మనిషివయ్యేవు’ అని ఆయన సందేశమిచ్చారు.

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

తాలిబన్స్తో ఓ టీ మీట్తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్లోకి వచ్చారన్నారు. వారితో పాక్లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.

ప్రస్తుతం కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనవిధానాల వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలుతోంది. అలాగే కాలంతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్లైన్లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.

ICC మెన్స్ T20WC-2026 వేదికలు దాదాపు ఖరారయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నైలో మ్యాచ్లు జరిగే అవకాశముంది. పాక్ మ్యాచ్లను కొలంబోలో నిర్వహిస్తారు. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మొత్తం 20 టీమ్స్ 4 గ్రూపుల్లో ఆడతాయి. ప్రతి గ్రూపులోని టాప్-2 జట్లు సూపర్-8కి చేరతాయి. ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడతాయి. ఇందులో టాప్-2 జట్లు సెమీస్కు వెళతాయి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.

AP: డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని CM చంద్రబాబు తెలిపారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సాయంతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, RTGSతో సమన్వయంపై అధికారులు, మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘అందుబాటులో ఉన్న డేటాను రియల్టైమ్లో ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని విస్తరించాలి. డిజిలాకర్లో విద్యార్థుల సర్టిఫికెట్లు, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉండాలి’ అని సూచించారు.
Sorry, no posts matched your criteria.