News September 7, 2025

గ్రహణం.. ఈ విషయాలు తెలుసా?

image

✰ గ్రహణాలు ఏర్పడినపుడు సూర్య, చంద్రుల నుంచి విడుదలయ్యే ప్రతికూల శక్తి దేవాలయాల్లోని విగ్రహాల శక్తిని కోల్పోయేలా చేస్తుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయంలోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా తలుపులు మూసివేస్తారు.
✰ గ్రహణ సమయంలో వంట చేయొద్దని, వండిన ఆహారం విషంగా మారుతుందని, దానిని తినవద్దనే అపోహ ఉంది. అయితే ఇందులో నిజం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

News September 7, 2025

అమరావతికి వచ్చి చూస్తే తెలుస్తుంది: నారాయణ

image

AP: రాజధాని అమరావతిలో భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. IAS అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని, పనులు జరగట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడకు వచ్చి చూస్తే ఎంత మంది, ఎన్ని కంపెనీలు పని చేస్తున్నాయో తెలుస్తుందన్నారు.

News September 7, 2025

చంద్రగ్రహణం వేళ చదవాల్సిన మంత్రాలు

image

ఈరోజు రాత్రి చంద్ర గ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో ‘ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః’ అనే మంత్రాన్ని జపిస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘మహా మృత్యుంజయ మంత్రం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన చాలా శక్తిమంతమైనది. ఓం నమః శివాయ అనే మంత్రం రాహు-కేతువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలు కూడా ప్రతికూల శక్తులను తొలగిస్తాయి’ అని అంటున్నారు.

News September 7, 2025

ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

image

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.

News September 7, 2025

తిరుపతి లడ్డూ హైదరాబాద్‌లో

image

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ మహా ప్రసాదం హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంటుందని చాలామందికి తెలియదు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయాల్లో 9AM నుంచి 5PM వరకు వీటిని విక్రయిస్తారు. ఒక్కో లడ్డూ ధర ₹50. ఒకరు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. వివిధ కారణాలతో తిరుమల వెళ్లలేని వారికి ఇక్కడే లడ్డూ లభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది.

News September 7, 2025

బంధం బలంగా మారాలంటే..

image

ఆలుమగల బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భాగస్వామితో ఎన్నో చెప్పాలనుకుంటారు. కానీ వాళ్లు అపార్థం చేసుకుంటారేమోనని చెప్పరు. లోలోపలే సతమతం అవుతుంటారు. దీంతో నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను చెబితేనే అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు. అలాగే కొందరు మాటలతోనే భాగస్వామిని గాయపరుస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం.

News September 7, 2025

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

image

* హెవీ మేకప్‌ కాకుండా తేలికపాటి, వాటర్‌ ప్రూఫ్‌ లైట్‌ మేకప్‌ ఎంచుకోవాలి.
* ఫౌండేషన్, కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్‌.
* జిడ్డు చర్మం ఉంటే కాఫీ, చార్‌కోల్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉన్న టోనర్ ఉపయోగించడం మంచిది.
* తాజా పండ్లు, ఆకుకూరలు, తగినన్ని నీరు తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. కనీసం వ్యాయామం చేయాలి.

News September 7, 2025

వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

image

* మేఘావృతమైన రోజుల్లోనూ సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఉపయోగించాలి.
* వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.
* సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
* మొటిమలను నివారించడానికి ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

News September 7, 2025

రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్

image

AP: త్వరలో నంది అవార్డులు అందించేందుకు CM చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. పాలకొల్లులో నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపనకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రాష్ట్ర కళాకారులకు గొప్ప అవకాశం. నవంబర్‌లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు.