News June 8, 2024

వందేభారత్ రైళ్ల సగటు వేగం 76.25Kmphకి తగ్గింది: RTI

image

వందేభారత్ రైళ్ల సగటు వేగం గత మూడేళ్లలో 84.48Kmph నుంచి 76.25Kmphకి తగ్గిందని RTI కింద అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో 160KM ఉండగా, మిగతా ప్రాంతాల్లో 130km లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఆ పనులు పూర్తయిన తర్వాత రైళ్లు 250km వేగంతో వెళ్తాయని చెబుతున్నారు.

Similar News

News October 6, 2024

ఈ విషయాన్ని గమనించారా?

image

మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా LTE, VoLTE అనే గుర్తును నెట్‌వర్క్ బార్ పక్కన చూసుంటారు. అయితే, అలా ఎందుకు ఉందో చాలా మందికి తెలియదు. VoLTE అంటే వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్. మెరుగైన కాలింగ్ ఫీచర్‌, వాయిస్& డేటాను ఏకకాలంలో ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది అందిస్తుంది. HD వాయిస్, వీడియో కాలింగ్, రిచ్ కాల్ సర్వీస్‌ల వంటి మెరుగైన కాలింగ్ ఫీచర్‌లు పొందవచ్చు. ఇది 2011లో అందుబాటులోకి వచ్చింది.

News October 6, 2024

స్వర్ణయుగంలోకి రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి

image

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.5వేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. దసరా ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. భవనాల డిజైన్‌లకు సంబంధించిన ఫొటోలను ఆయన Xలో పంచుకున్నారు.

News October 6, 2024

7 నెలల్లో స్కూళ్ల నిర్మాణాలు పూర్తి: భట్టి

image

TG: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని, 7 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామని డిప్యూటీ CM భట్టి చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఈ స్కూల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉంటుందని, ఒక్కో స్కూలుకు రూ.25కోట్లు ఖర్చు చేస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.