News June 4, 2024

అవినాశ్ రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం

image

AP: కడప పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ(SC) అభ్యర్థి వరప్రసాద్ రావు లీడింగులో ఉన్నారు.

Similar News

News December 26, 2025

ఆ ధీరుడిని TDP గూండాలు హతమార్చి..: అంబటి ట్వీట్

image

AP: దివంగత కాపు ఉద్యమనేత వంగవీటి మోహన రంగాకు మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబు నివాళులు అర్పించారు. ఈమేరకు ట్వీట్ చేస్తూ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ‘దీక్షలో ఉన్న ధీరుడిని టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 37 సంవత్సరాలు. “జోహార్ వంగవీటి మోహన రంగా”!’ అని Xలో పొందుపరిచారు. మరోవైపు వైసీపీ నేతలు పలువురు రంగాకు నివాళులు అర్పించారు.

News December 26, 2025

అమ్మ సెంటిమెంట్.. మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్

image

సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాశ్‌ను ఓ వ్యక్తి SMలో సాయం కోరాడు. ఓ ఫొటోను షేర్ చేసి.. అమ్మ చనిపోయిందని అంత్యక్రియలకు డబ్బుల్లేవని తెలిపాడు. దీంతో చలించిపోయిన జీవీ ప్రకాశ్.. రూ.20,000 పంపించారు. అయితే ఆ ఫొటో 2022 నాటిదని, తాను మోసపోయానని తర్వాత గుర్తించారు. అమ్మ పేరుతో మోసం చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సాయం చేసిన GVని ప్రశంసిస్తున్నారు.

News December 26, 2025

ఆస్ట్రేలియా దెబ్బ.. కుప్పకూలిన ఇంగ్లండ్

image

ASHES SERIES: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఫస్ట్ డేనే రెండు జట్లు కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా ఇంగ్లండ్ అంతకంటే ఘోరంగా 110 రన్స్‌కే చాప చుట్టేసింది. హ్యారీ బ్రూక్ (41), స్టోక్స్ (16), అట్కిన్సన్ (28) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు.