News August 16, 2024

దుబాయ్ వెళ్లేందుకు అవినాశ్ యత్నం.. అనుమతి నిరాకరణ

image

AP: దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి ఆయన దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై FIR నమోదైందని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు సూచించారు. అనుమతి నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు.

Similar News

News January 21, 2026

1.12 కోట్ల ఉద్యోగాలిచ్చేలా MSMEలకు కేంద్ర ప్రోత్సాహం

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹5,000 CR EQUITY సపోర్టుగా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. MSMEలకు రుణ ప్రోత్సాహంగా దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా 25.74 L సంస్థలకు లబ్ధి చేకూరి 1.12 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. కాగా <<18915747>>అటల్ పెన్షన్<<>> యోజన స్కీమ్‌ను 2030–31 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

News January 21, 2026

తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

image

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్‌ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.

News January 21, 2026

‘బంగారు’ భవిష్యత్తు కోసం చిన్న పొదుపు!

image

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. అందుకే ఒకేసారి కొనలేకపోయినా ప్రతిరోజూ చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ కొనడం లేదా జువెలరీ షాపుల స్కీమ్స్‌లో చేరడం మంచిది. ఇప్పుడు గోల్డ్ SIPల ద్వారా రోజుకు రూ.30 నుంచే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా జమ చేయడం వల్ల భవిష్యత్తులో పెరిగే ధరల లాభం మీకే దక్కుతుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న పొదుపుతోనే ఎంతో కొంత బంగారం కొనొచ్చు.