News July 24, 2024

శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

image

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్‌కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News February 3, 2026

నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

image

TG: మున్సి పల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై సాయంత్రం క్లారిటీ రానుంది. రెబల్స్‌ను బుజ్జగించే పనిలో 3 పార్టీల (కాంగ్రెస్, BRS, BJP) అగ్రనేతలు నిమగ్నమయ్యారని సమాచారం. పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.

News February 3, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు

image

<>ఆయుష్ <<>>మంత్రిత్వశాఖ 6 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MBA, PG/M.Phil/PhD, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. జీతం నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 3, 2026

ఒకే దేవుడికి చెందిన విగ్రహం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదా?

image

అలా ఉన్నా ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కంటే భక్తే ముఖ్యం. అయితే వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దీపారాధన చేస్తూ ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ అదనంగా విగ్రహాలను ఉంచడం ఇష్టం లేకపోతే వాటిని దేవాలయాలకు దానం చేయవచ్చు. శుభ్రమైన వస్త్రంలో చుట్టి భద్రపరచవచ్చు. అయితే విరిగిన/పాడైన విగ్రహాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. పవిత్రమైన చెట్ల కింద లేదా దేవాలయాల వద్ద ఉంచడం శ్రేయస్కరం.