News July 24, 2024
శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News January 21, 2026
రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ <
News January 21, 2026
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. మళ్లీ పడతాయా?

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 25,185 వద్ద, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 82,025 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్లో ICICI బ్యాంక్, BE, ట్రెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాలో ట్రేడవుతున్నాయి. నిన్న ₹9 లక్షల కోట్లకు పైగా మార్కెట్లు <<18907026>>నష్టపోవడం<<>> తెలిసిందే.
News January 21, 2026
ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.


