News July 24, 2024
శవ రాజకీయాలు మానుకో జగన్: జీవీ

AP: చంద్రబాబు ఢిల్లీ నుంచి నిధులను సాధించుకొస్తే.. జగన్ శవ రాజకీయాలు కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ‘తన హయాంలో ఏపీ పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారు. అసెంబ్లీలో మొహం చూపించలేకే ఆయన హస్తిన వెళ్లారు. వినుకొండలో వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన 256 హత్యలకు ఏం సమాధానం చెబుతారు. జగన్కు పదవీ కాంక్ష తప్ప మరో ఆలోచన లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News January 12, 2026
అగ్నివీర్ వాయు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 12, 2026
మినుములో పల్లాకు తెగులు లక్షణాలు – నష్టాలు

మినుము పంటలో పల్లాకు తెగులు సోకిన తొలి దశలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా అవి ముదురు పసుపు రంగులోకి మారతాయి. కొన్నిసార్లు ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు వల్ల మొక్కలు గిడసబారి, ఎదుగుదల కుంటుపడుతుంది. పూత ఆలస్యంగా వస్తుంది లేదా ఎండిపోతుంది. కాయలు తక్కువ సంఖ్యలో వచ్చి వాటిపై కూడా మచ్చలు వస్తాయి. ఫలితంగా గింజల నాణ్యత, పరిమాణం తగ్గిపోతుంది.
News January 12, 2026
గరుడ పురాణం ఏం చెబుతుందంటే..?

గరుడ పురాణం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, కర్మ ఫలాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. మనిషి బతికున్నప్పుడు చేసే పాపపుణ్యాలకు అనుగుణంగా యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో ఉంటుంది. సృష్టి రహస్యాలు, ధర్మ సూత్రాలు, ఔషధ గుణాలు, మోక్ష మార్గాలను కూడా ఇది బోధిస్తుంది. హిందూ సంప్రదాయంలో మరణానంతరం గరుడ పురాణ పారాయణం చేయడం వల్ల ఆత్మకు శాంతి, సద్గతులు కలుగుతాయని నమ్మకం. <<-se>>#GARUDAPURANAM<<>>


