News December 1, 2024
ఈ జ్యూస్లను తాగకపోవడమే మంచిది: వైద్యులు

పండ్లు తినే బదులు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది కదా? అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఈ మూడింట్లో ఏది బెటరో వైద్యులు సూచించారు. ‘ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో అధిక మొత్తంలో షుగర్ ఉండటం వల్ల వాటిని సేవించొద్దు. తాజా పండ్ల రసాలు తాగడం వల్ల అధిక మొత్తంలో పండ్లు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ జ్యూస్ తాగినా, తాజా పండ్లు తినేందుకే మొగ్గుచూపాలి’ అని డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
News November 21, 2025
30న అఖిలపక్ష సమావేశం

DEC 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చల అజెండాలపై ఏకాభిప్రాయం, సజావుగా సమావేశాల నిర్వహణే లక్ష్యమని తెలిపారు. ఈసారి SIR అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగనుంది. శీతాకాల సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


