News March 24, 2024
భారత ప్లేయర్లకు పురస్కారాలు

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లు శ్రేయాంకా పాటిల్, షఫాలీ వర్మ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. తనకు క్రికెట్లో స్టార్ ప్లేయర్ కోహ్లీ స్ఫూర్తి అని శ్రేయాంక తెలిపారు. గత సీజన్లో విరాట్ ఇచ్చిన ధైర్యం అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. మరోవైపు 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ‘యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


