News November 28, 2024
10 రోజుల ముందుగానే ‘అయోధ్య’ వార్షికోత్సవం.. కారణమిదే

యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీనే రామాలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగగా, 10 రోజుల ముందుగానే వార్షికోత్సవం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి(కూర్మ ద్వాదశి) నాడు వేడుక నిర్వహించాలి. 2025లో ఈ తిథి జనవరి 11నే రావడంతో ఆ రోజే వేడుకలు జరగనున్నాయి.
Similar News
News February 3, 2026
ఆసీస్కు మరో షాక్.. ప్రారంభ మ్యాచ్లకు హేజిల్వుడ్ దూరం

T20 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టోర్నీకి కమిన్స్ దూరమవ్వగా, తాజాగా ఆ జట్టు కీలక బౌలర్ హేజిల్వుడ్ కొన్ని మ్యాచులకు దూరంకానున్నారు. కాలి మడమ నొప్పి గాయం నుంచి కోలుకుంటున్న హేజిల్వుడ్ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో అతడి స్థానంలో రిజర్వ్ పేసర్గా సీన్ అబాట్కు అవకాశం కల్పించారు.
News February 3, 2026
సమీకృత వ్యవసాయంలో ఈ రైతు విజయం ఆచరణీయం

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.
News February 3, 2026
గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

గోవా షిప్యార్డ్ లిమిటెడ్(<


