News April 20, 2025
IPL.. రికార్డు సృష్టించాడు

సీఎస్కే తరఫున బరిలోకి దిగిన యంగెస్ట్ ప్లేయర్గా ఆయుష్ మాత్రే(17y 278d) రికార్డు నెలకొల్పారు. ముంబైతో జరుగుతున్న మ్యాచులో మాత్రే అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో అభినవ్ ముకుంద్(18y 139d), అంకిత్ రాజ్ పుత్(19y 123d), పతిరణ(19y 148d), నూర్ అహ్మద్(20y 79d) ఉన్నారు. ఓవరాల్గా IPLలో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ(14y 23d) ఉన్నారు.
Similar News
News April 21, 2025
IPL: ముంబై సునాయాస విజయం

చెన్నై చాలా కష్టంగా చేసిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్మని ఊదేసింది. రోహిత్ హాఫ్ సెంచరీ(76*)తో ఫామ్లోకి రాగా అటు సూర్య కూడా తనదైన శైలిలో అర్ధ శతకం(68*) చేయడంతో 16వ ఓవర్లోనే MI టార్గెట్ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
News April 20, 2025
‘నాలా ఎవరూ మోసపోవద్దు’ అంటూ ఆత్మహత్య

AP: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి(మ) పైడేటికి చెందిన జయ చంద్ర కొన్నేళ్లుగా ఆన్లైన్ గేమ్స్కు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ బాధను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు. వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు. నాలాగా మోసపోవద్దు’ అని షర్టుపై రాసుకొని మరీ సూసైడ్ చేసుకున్నాడు. జయ చంద్ర డిగ్రీ చదివి, వ్యవసాయం, పాల వ్యాపారం చేస్తున్నాడు.
News April 20, 2025
జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

TG: జపాన్ పర్యటనలో భాగంగా పలు సంస్థలతో CM రేవంత్ బృందం పలు ఒప్పందాలు చేసుకుంది. HYDలో ఎకో టౌన్ ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో MOU చేసుకుంది. వీటితో HYDలో భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని CM విశ్వాసం వ్యక్తపరిచారు.