News January 9, 2025

ఆయుష్మాన్ భారత్‌కు నిరాకరణ.. క్యాన్సర్ పేషంట్ ఆత్మహత్య

image

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నిరాకరించిందని 72 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఈ పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వైద్యులు ఉచిత చికిత్సకు నిరాకరించారు. డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనా స్కీం అందలేదనే ఆవేదనతో అతను సూసైడ్ చేసుకున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Similar News

News February 2, 2026

రూ.9.8 కోట్ల లెక్కలేవి? KCRకు సిట్ ప్రశ్న!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ముందు సిట్ అధికారులు కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంటెలిజెన్స్ టీం అత్యాధునిక పరికరాలు వాడిందని, వాటి విలువ దాదాపు రూ.9.8 కోట్ల వరకు ఉంటుందని కేసీఆర్ ముందు వివరాలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరికరాల కొనుగోలు లెక్కల గురించి ఆయనను సిట్ ప్రశ్నించగా ఈ విషయం తనకు తెలియదంటూ KCR సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

News February 2, 2026

నేతలు అలాంటి భాష మాట్లాడకూడదు: హైకోర్టు

image

AP: రాజకీయాల్లో దూషణలు, వ్యక్తిగత దాడులు ఎక్కువవుతుండటం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలపై హైకోర్టు రాజకీయ నేతలకు హితవు పలికింది. ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఎంతో హుందాగా వ్యవహరించాలని పేర్కొంది. మాజీమంత్రి అంబటి రాంబాబు <<19023876>>భార్య<<>> వేసిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నేతలు అలాంటి భాష మాట్లాడకూడదని, వారు వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని హితవు పలికింది.

News February 2, 2026

నాని ‘ప్యారడైజ్’ విడుదల వాయిదా?

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఏమైనా ఆలస్యం జరిగితే జులైలో రిలీజయ్యే అవకాశముందని వెల్లడించాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.