News October 30, 2024
ఆయుష్మాన్ భారత్ పెద్ద స్కాం: ఆప్

ఆయుష్మాన్ భారత్లో ఢిల్లీ చేరకపోవడాన్ని PM మోదీ తప్పుబట్టడంపై ఆప్ స్పందించింది. BJP పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం పెద్ద స్కాం అని MP సంజయ్ సింగ్ విమర్శించారు. ఇందులోని నిబంధనల వల్ల ఒక్క ఢిల్లీ వ్యక్తికి కూడా పథకం వర్తించదన్నారు. ఫ్రిడ్జ్, స్కూటర్ ఉన్నా, ₹10 వేలకు పైగా ఆదాయం ఉంటే పథకం లబ్ధిపొందలేరని పేర్కొన్నారు. దర్యాప్తు జరిపితే పథకంలోని నిర్వహణ లోపం బయటపడుతుందన్నారు.
Similar News
News January 19, 2026
NGKL: తెలుగు సాహిత్యానికి రుక్మంధ రెడ్డి జీవితం అంకితం

వెల్దండ మండలానికి చెందిన ప్రముఖ పద్య కవి <<18894607>>రుక్మంధర రెడ్డి<<>> తన జీవితాన్ని మొత్తం సాహిత్యానికే అంకితం చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా, పదవీ విరమణ అనంతరం తెలుగు అధ్యాపకుడిగా వందల మందిని తెలుగు సాహిత్య వేత్తలుగా, తెలుగు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. పది పుస్తకాలను రచించారు. ఎందరో వర్తమాన కవులకు సాహిత్య మెలకువలను అందించారు. ఎన్నో సన్మానాలను, అవార్డులను అందుకున్నారు.
News January 19, 2026
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.


