News December 30, 2024
నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం

మండల పూజ అనంతరం DEC 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.
Similar News
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.
News November 21, 2025
మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.
News November 21, 2025
24 నుంచి కొత్త కార్యక్రమం

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు.


