News January 11, 2025
తిరుపతి ఘటనలో బాబే తొలి ముద్దాయి: రోజా

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో తొలి ముద్దాయిగా CM చంద్రబాబు పేరును చేర్చాలని YCP నేత రోజా డిమాండ్ చేశారు. ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో ఒక్కరు చనిపోతేనే 16 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. తిరుపతిలో ఆరుగురు చనిపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనకు కారకులైన CM, Dy.CM, TTD EO, JEO, SPలపై కేసు నమోదు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News October 19, 2025
అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
News October 19, 2025
HOT TOPIC: మావోయిస్టులతో నేతల సంబంధాలు?

TG: కొంత మంది రాజకీయ నాయకులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారన్న బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మావోయిస్టుల సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారని, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో సంబంధాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. దీంతో ఆ నేతలెవరనే చర్చ మొదలైంది.
News October 19, 2025
APPLY NOW: BELలో 176 ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)176 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.