News April 2, 2024
పెన్షన్ల నిలుపుదలకు బాబే కారణం: మంత్రి మేరుగు

AP: పెన్షన్ల నిలుపుదలకు TDP చీఫ్ చంద్రబాబే కారణమని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ‘వాలంటీర్ల సేవల గురించి ప్రజలకు తెలుసు. చంద్రబాబు పేదలకు సాయం అందకుండా చేశారు. పింఛన్లు అందకపోవడంతో అవ్వాతాతలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 21, 2025
25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.


