News October 4, 2024
పాలనలో ఫెయిల్ కావడంతోనే బాబు టాపిక్ డైవర్ట్ చేశారు: జగన్
AP: చంద్రబాబు పాలనలో ఫెయిలవడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు లడ్డూ వివాదం సృష్టించారని జగన్ ఆరోపించారు. ‘JULY 23న లడ్డూ తయారీకి సంబంధించిన రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పి సెప్టెంబర్ 18న తన 100 రోజుల పాలన మీద మాట్లాడుతూ ఈ రిపోర్ట్ గురించి చెప్పారు’ అని జగన్ అన్నారు. నెయ్యిలో కలిసింది జంతు కొవ్వు కాదని, అయినా దాన్ని తిరస్కరించామని TTD EO అంటుంటే బాబు అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
Similar News
News October 4, 2024
ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.
News October 4, 2024
మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్
రక్షణ విషయంలో భారత్కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
News October 4, 2024
అభిమానులకు రజినీకాంత్ సందేశం
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.