News November 1, 2024
బాబు వచ్చాడు.. ప్రజల భవిష్యత్తు అంధకారం: VSR

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ధరలు కొండెక్కాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నా CBN పట్టించుకోవట్లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది’ అని Xలో ఫైరయ్యారు.
Similar News
News February 2, 2026
కరోండా జీవకంచెతో అనేక ప్రయోజనాలున్నాయ్

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
News February 2, 2026
తగ్గనున్న చలి.. పెరగనున్న ఎండ తీవ్రత

ఈ నెల నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల చలి తీవ్రత క్రమంగా తగ్గనుంది. అలాగే ఎండ తీవ్రత కూడా పెరుగుతుందని పేర్కొంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా.. కేరళ, మధ్య భారతం మినహా మిగిలిన చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సగటుకు మించి నమోదవుతున్నాయి.
News February 2, 2026
పిండి దీపం వెలిగిస్తున్నారా?

పిండి దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దీపారాధనతో గ్రహ దోషాలు, ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నారాయణుడి మంత్రోచ్చారణలతో 7 వారాల పాటు ఇలా చేయాలని సూచిస్తున్నారు. పిండి దీపం ఎలా తయారుచేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


