News August 2, 2024

రైళ్లలో బేబీ బెర్తులు: కేంద్ర రైల్వేమంత్రి

image

రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. ‘లక్నో మెయిల్‌లోని ఒక కోచ్‌లో 2 బేబీ బెర్తులను అమర్చాం. దీనిపై ప్రశంసలొచ్చాయి. సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికొచ్చాయి. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి’ అని BJP MP అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Similar News

News November 22, 2025

HBTUలో 29 టీచింగ్ పోస్టులు

image

యూపీలోని హర్‌కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hbtu.ac.in/

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT

News November 22, 2025

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.