News August 2, 2024
రైళ్లలో బేబీ బెర్తులు: కేంద్ర రైల్వేమంత్రి

రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. ‘లక్నో మెయిల్లోని ఒక కోచ్లో 2 బేబీ బెర్తులను అమర్చాం. దీనిపై ప్రశంసలొచ్చాయి. సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికొచ్చాయి. ప్యాసింజర్ కోచ్లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి’ అని BJP MP అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Similar News
News March 4, 2026
శ్రీకాకుళం: టెన్త్ పాస్..230 ఖాళీలకు జాబ్ మేళా

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 6న ఉదయం 10 గంటల కు ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి సుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిందో ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 4, 2026
అల్లు ఫ్యామిలీని చూశారా?

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 4, 2026
ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.


