News March 16, 2024
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యం

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. ఏపీ అభివృద్ధిలో PhD పూర్తి చేశారు. వైయస్ రాజశేఖర్రెడ్డి సహకారంతో 2007లో తుడా ఛైర్మన్ గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.
Similar News
News October 13, 2025
కొనకనమిట్ల వద్ద ప్రమాదం.. మరో ఇద్దరు స్పాట్డెడ్.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురురాళ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా CSపురం వద్ద <<17997659>>గంటక్రితం ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే.
News October 13, 2025
రేపు ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో ప్రకాశంకు రేపు వర్ష సూచన ఉన్నట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఉండరాదని సూచించారు.
News October 13, 2025
ప్రకాశం SP మీకోసంకు 71 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఏఎస్పీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో వారు మాట్లాడి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.