News October 24, 2024
జస్టిస్ సంజీవ్ ఖన్నా నేపథ్యం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి CJIగా ఆయన 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Similar News
News October 25, 2024
తిరుమల హోటళ్లకు బాంబు బెదిరింపులు
AP: తిరుమలలోని నాలుగు హోటళ్లను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం తిరుపతి, అలిపిరి పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. మరోవైపు ఇవాళ ఏకంగా 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కూడా కలకలం రేపింది. వీటిలో ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో విమానాలు ఉన్నాయి.
News October 25, 2024
పగలు జాబ్.. రాత్రి ఫ్రీ కోచింగ్.. హ్యాట్సాఫ్ సర్!
నిస్వార్థంగా సాయం చేసేవారు చాలా అరుదు. హరియాణాలోని బహదుర్గఢ్కు చెందిన కానిస్టేబుల్ అజయ్ గ్రేవల్ అదే కోవకు చెందుతారు. ఢిల్లీ పోలీసు శిక్షణ కాలేజీలో పనిచేస్తున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు తన ఇంటిపైనే రాత్రుళ్లు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణలో 3వేలమందికిపైగా ఉద్యోగాలు సాధించారు. రోజుకు 5 గంటలే నిద్రపోయినా, డబ్బు కంటే విలువైన ఆత్మసంతృప్తిని పొందుతున్నానంటున్నారాయన. హ్యాట్సాఫ్ సర్.
News October 25, 2024
మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే?
ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.