News October 26, 2024
టీమ్ ఇండియాకు బ్యాడ్ డేస్
గత రెండు వారాల్లోనే భారత పురుషుల జట్టు, మహిళల, యువకుల జట్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్నాయి. కివీస్పై మెన్స్ టీమ్ 36 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆసియా కప్లో ఉమెన్స్ టీమ్ సెమీ ఫైనల్కు వెళ్లలేకపోయింది. దుబాయ్లో జరిగిన ఎమర్జింగ్ టోర్నీ సెమీ ఫైనల్లో పసికూన అఫ్గానిస్థాన్పై భారత యువ జట్టు ఓడి ఫైనల్కు చేరలేకపోయింది. దీంతో భారత జట్టుకు ఇవి మంచి రోజులు కావంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News October 26, 2024
చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్
తూర్పు లద్దాక్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.
News October 26, 2024
కొంకణ్ తీరాన్ని ఏలేది ఎవరు?
మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో దశలో ఒక్కో పార్టీ తన ప్రాభవాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూటములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలికలతో బీజేపీ, శివసేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్తో కలసి గత వైభవాన్ని చాటేందుకు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
News October 26, 2024
మినీ మేడారం జాతర తేదీలు ఖరారు
TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.