News April 6, 2024

ఘోరం: కూతురు చదవట్లేదని కొట్టి చంపేశాడు

image

రాజస్థాన్‌లోని సిరోహీ జిల్లాలో దారుణం జరిగింది. 11వ తరగతి పరీక్షలకు సరిగ్గా చదవడం లేదనే కారణంతో 17 ఏళ్ల కూతురిని తండ్రి కర్రతో చితకబాదాడు. దెబ్బలను తట్టుకోలేక బాలిక కన్నుమూసింది. బాలిక మామయ్య ఫిర్యాదుతో నిందితుడు ఫతే మహమ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా?

image

రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్‌తో కలిపితే ఇంకా ఆలస్యం అవుతుందంటున్నాయి. దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించిన మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదని చర్చించుకుంటున్నాయి. మే లేదా జూన్ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.

News January 24, 2026

మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.

News January 24, 2026

MANAGEలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (<>MANAGE<<>>) 3 Assist. డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రి B.M./HR మేనేజ్‌మెంట్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.manage.gov.in