News March 17, 2024

GTకి బ్యాడ్ న్యూస్

image

గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్‌ కీపర్‌ రాబిన్ మింజ్ ఈ ఏడాది IPL మొత్తానికి దూరమయ్యారు. ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడ్డ అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీజన్‌ మొత్తానికి మింజ్‌ దూరమైనట్లు కోచ్ ఆశిశ్ నెహ్రా తెలిపారు. కాగా IPL-2024 మినీ వేలంలో అతణ్ని రూ.3.60 కోట్ల భారీ ధరకు GT కొనుగోలు చేసింది.

Similar News

News April 12, 2025

రేపే రిజల్ట్స్.. ఆత్మహత్యలు వద్దు సోదరా!

image

సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT

News April 12, 2025

ధోనీపై తమిళ హీరో అసహనం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.

News April 12, 2025

PHOTOS: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

image

AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.

error: Content is protected !!