News September 29, 2024
బ్యాడ్న్యూస్.. పెరిగిన చికెన్ ధర
నాన్వెజ్ ప్రియులకు బ్యాడ్న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతోంది. ఈనెల మొదట్లో కేజీ చికెన్ స్కిన్లెస్ రేట్ రూ.160-180 మధ్య పలికింది. 2 వారాల కిందట అది రూ.200 దాటగా గత వారం రూ.236కు చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్లెస్ రేట్ రూ.243గా ఉంది. దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చికెన్ రేట్ మీ ప్రాంతంలో ఎంత ఉంది?
Similar News
News September 29, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్లపై BIG UPDATE
AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.
News September 29, 2024
అమెరికా పెద్ద తప్పు చేసింది: నార్త్ కొరియా
ఉక్రెయిన్కు 8 బిలియన్ డాలర్ల సైనిక సహాయం ఇవ్వాలని నిర్ణయించి అమెరికా పెద్ద తప్పు చేసిందని నార్త్ కొరియా అభిప్రాయపడింది. ఇది నిప్పుతో చెలగాటం లాంటిదని పేర్కొంది. ఉక్రెయిన్ సంఘర్షణను వాషింగ్టన్ తీవ్రతరం చేస్తోందని, ఐరోపా మొత్తాన్ని అణుయుద్ధం అంచుకు నడిపిస్తోందని దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. రష్యా హెచ్చరికల్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు.
News September 29, 2024
ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
AP: విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.