News October 19, 2024
తిరుపతిలో ‘బడి వైన్స్’.. నెటిజన్ల ట్రోల్స్
AP: నూతన మద్యం విధానంలో భాగంగా ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ఓ ప్రైవేటు మద్యం షాపు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాని పేరు ‘బడి వైన్స్’ అని ఉండటమే దీనికి కారణం. నాన్నలకూ ఓ బడి తెరిచారని, అక్కడ ‘మందు’ చదువులు చెబుతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదని, ఆ షాపు యజమాని ఇంటి పేరే అదని పలువురు పేర్కొంటున్నారు.
Similar News
News October 19, 2024
శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. అంతలోనే!
చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా ఒక్కసారిగా అతను లేచాడు. గతంలో USAలో జరిగిన ఈ ఘటన తాజాగా వైరలవుతోంది. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అవయవాలను చెక్ చేసేందుకు పరీక్ష చేయగా అతనిలో కదలిక, కళ్లలోంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేయగా గుండె తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి కూర్చున్నాడు.
News October 19, 2024
నా దేవుడు కోహ్లీ ఆశీర్వాదం కోసం వచ్చా: అభిమాని
బెంగళూరులో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్ తొలి టెస్టును చూసేందుకు భారీగా విరాట్ కోహ్లీ అభిమానులు తరలివచ్చారు. తన దేవుడు కోహ్లీ కోసం వచ్చానంటూ ఓ అభిమాని ప్లకార్డుతో కనిపించారు. ‘ఈరోజు నా బర్త్ డే కాబట్టి నా దేవుడు విరాట్ కోహ్లీ ఆశీస్సులు తీసుకునేందుకు ఈ గుడికి వచ్చాను’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఈ ఫొటో వైరలవుతోంది. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
News October 19, 2024
పోలీసులపైకి కుర్చీలు విసిరిన కార్యకర్తలు
సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. దీంతో లాఠీఛార్జ్ చోటు చేసుకోగా పలువురు గాయపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఇవాళ హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.