News August 4, 2024
BADMINTON: ఇక మిగిలింది కాంస్యమే

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్లో లక్ష్యసేన్ ఓటమి భారత అభిమానులను నిరాశపర్చింది. అయితే సేన్ ఒలింపిక్ మెడల్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. రేపు జరిగే మ్యాచ్లో మలేషియా ఆటగాడు లీ జీపై గెలిస్తే కాంస్య పతకం లక్ష్యసేన్ను వరిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్లో లక్ష్యసేన్పై గెలిచిన విక్టర్ అక్సెల్సెన్, విటిడ్సార్న్తో (థాయ్లాండ్) ఫైనల్లో తలపడనున్నారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News April 6, 2026
‘కుంభకర్ణుడి నిద్ర’కు కారణమేంటి?

ఎప్పుడూ నిద్రపోతూ, ఎంత పిలిచినా లేవని వాళ్లను కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావని అంటాం. బలవంతుడైన కుంభకర్ణుడు ఇంద్రాసనం పొందడానికి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తారు. ఇది ప్రమాదమని గ్రహించిన సరస్వతి అతని నాలుకపై చేరి నిద్రాసనం కోరుకొనేలా చేస్తారు. తర్వాత కుంభకర్ణుడి వినతి మేరకు 6 నెలలు నిద్ర, ఓరోజు మెలకువగా వరాన్ని బ్రహ్మ సవరిస్తారు.
* మీకు తెలిసి కుంభకర్ణుడిలా నిద్రపోయేవారెవరైనా ఉన్నారా?
<<-se>>#EPICSAYINGS<<>>
News April 6, 2026
ధోనీకి 2 రోజుల్లో ఫిట్నెస్ టెస్ట్?

CSK మాజీ కెప్టెన్ ధోనీ IPLలో త్వరలోనే ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2 రోజుల్లో ఆయనకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారని CSK క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అందులో పాస్ అయితే ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారంటున్నాయి. ఫిట్నెస్ లేక IPLకు రెండు వారాల పాటు ధోనీ దూరమవుతారని జట్టు యాజమాన్యం చెప్పిన విషయం తెలిసిందే. కాగా CSK ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది.
News April 6, 2026
FLASH: పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ (సీజ్ఫైర్) దిశగా సంకేతాలు రావడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ <<19578430>>ఉదయంతో<<>> పోలిస్తే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,530 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,400 వృద్ధితో రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కేజీకి రూ.5,000 ఎగబాకి రూ.2,60,000 పలుకుతోంది.


